News August 21, 2024
ఆస్తులు కాదు.. వీటి గురించి తెలుసుకోండి!

పెళ్లికి చూడాల్సింది ఆస్తులు కాదు.. ఆరోగ్యం, దుర్వ్యసనాల గురించి తెలుసుకోవాలి. ఎక్కువ సంబంధాలు చూస్తే విసుగొస్తుంది. అందుకే సరైన సమయంలో పెళ్లి చేసుకోవాలి. పెళ్లయ్యాక ఎలా ఉండాలో ఎవరూ నేర్పించరు. ముఖ్యంగా ఎవరి సలహాలు తీసుకోకుండా మీ సమస్యపై మీరిద్దరే మాట్లాడుకోవాలి. పెళ్లయ్యాక మీకు మీరు మాత్రమే తోడు. ఇంకా అమ్మకూచి అంటే కుదరదు. మూడో వ్యక్తిని రానివ్వకండి. భాగస్వామి అభిప్రాయాన్ని గౌరవించాలి. SHARE IT
Similar News
News July 10, 2025
PTM 2.0 కార్యక్రమాలు ఇవే

AP: మెగా <<17013073>>పేరెంట్స్-టీచర్స్ మీట్<<>> 2.0లో నిర్వహించే కార్యక్రమాలు ఇవే..
*విద్యార్థులు, పేరెంట్స్ ఫొటో సెషన్
*ప్రతి విద్యార్థి, పేరెంట్స్తో క్లాస్ టీచర్ సమావేశం
*తల్లికి వందనం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన
*తల్లులకు పుష్పాలిచ్చి పాదాభివందనం
*తల్లి పేరిట మొక్కలు నాటుతారు
*డ్రగ్స్, సైబర్ అవెర్నెస్ కార్యక్రమాలపై చర్చ
*అందరూ కలిసి సహపంక్తి భోజనం
*మ.ఒంటి గంట తర్వాత యథావిధిగా తరగతులు
News July 10, 2025
యూరియా అధికంగా వాడితే?

యూరియా కొరత నేపథ్యంలో దాన్ని సరఫరా చేస్తామంటూనే వాడకం తగ్గించుకోవాలని కేంద్రం సూచిస్తోంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. పంట ఏపుగా పెరిగేందుకు యూరియాను అధికంగా వాడితే భూసారం తగ్గడంతో పాటు భవిష్యత్తులో దిగుబడులు తగ్గి పెట్టుబడులు పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. యూరియా నుంచి వెలువడే అమ్మోనియాతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువులపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
News July 10, 2025
ఇవాళే ‘గురు పౌర్ణమి’.. ఎవరిని పూజించాలంటే?

ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. వ్యాస మహర్షి జన్మదినాన్నే గురు పౌర్ణమిగా పిలుస్తారని పండితులు చెబుతున్నారు. గురువును పూజిస్తే తనని పూజించినట్లేనని స్వయంగా వ్యాస మహర్షే చెప్పారట. అందుకే గురు పౌర్ణమికి దక్షిణామూర్తి, దత్తాత్రేయ, రాఘవేంద్రస్వామి, సాయిబాబాని పూజించాలని జ్యోతిషులు చెబుతున్నారు. అలాగే ‘వ్యాం, వేదవ్యాసాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తే పూజా ఫలితం దక్కుతుందట.