News April 16, 2025

17 మంది వైద్యుల వల్ల కానిది.. ChatGPT చేసింది!

image

వైద్య రంగంలో AI ఆవశ్యకతను తెలిపే ఓ వార్త వైరల్ అవుతోంది. కొవిడ్ సమయంలో USకు చెందిన తల్లి తన నాలుగేళ్ల కుమారుడిని 17 మంది వైద్యులకు చూపించింది. ఎవ్వరూ ఆ పిల్లాడి సమస్యకు కారణాన్ని చెప్పలేకపోయారు. విసిగిపోయిన తల్లి ChatGPTకి MRI రిపోర్ట్స్, పిల్లాడి లక్షణాలను వివరించింది. అది ‘టెథర్డ్ స్పైనల్ కార్డ్ సిండ్రోమ్‌’గా నిర్ధారించింది. ఈ సమాచారంతో వైద్యులు పరీక్షలు చేసి, శస్త్రచికిత్స చేశారు.

Similar News

News April 16, 2025

అనారోగ్యం భరించలేక యువకుడి ఆత్మహత్య

image

TG: మంచిర్యాల జిల్లాకు చెందిన చెల్మాటికారి అనిల్‌ను గత కొంతకాలంగా పచ్చకామెర్లు, దవడ బిళ్లలు, వైరల్ ఫీవర్ వేధిస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా అనారోగ్యం తగ్గలేదు. దీంతో క్షమించమంటూ తల్లిదండ్రులకు లేఖ రాసి ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించాడు. నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. చేతికందొచ్చిన బిడ్డను కోల్పోవడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

News April 16, 2025

ప్రైవేటులా ప్రభుత్వ వైద్యం.. నెటిజన్ ట్వీట్ వైరల్

image

TG వైద్య సేవల తీరుపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఉగాది రోజున AP నుంచి HYDకి వచ్చిన ఓ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో అంబులెన్సులో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే ఎక్స్‌రే, USG చేసి పేగుకు రంధ్రం ఉందని ఆపరేషన్ చేసి అతణ్ని కాపాడారు. ఇతర రాష్ట్రం అని తెలిసినా కూడా ప్రైవేటు స్థాయిలో వైద్యం అందించిన వైద్యులు, TG ప్రభుత్వం, 108 సిబ్బందికి ధన్యవాదాలు అని అతను ట్వీట్ చేశాడు.

News April 16, 2025

AI ఫొటో షేర్ చేసిన IAS స్మితకు పోలీసుల నోటీసులు

image

TG: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని చదును చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు AIని ఉపయోగించి జింకలు, నెమళ్లు దీనస్థితిలో చూస్తున్నట్లు ఫొటోలు ఎడిట్ చేశారు. అందులో MAR 31న ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ఫొటోను ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. తప్పుడు ఫొటోను షేర్ చేసినందుకు తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయితే, నోటీసులోని విషయాలను ఇప్పుడు బయటకు చెప్పలేమని పోలీసులు తెలిపారు.

error: Content is protected !!