News March 21, 2024

ప్రతి వెధవను గౌరవించక్కర్లేదు: నాగబాబు

image

AP: జనసేన నేత నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెధవను గౌరవించక్కర్లేదు. ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లు అవుతారు’ అంటూ కన్ఫ్యూషియస్ కోట్‌ను పోస్ట్ చేశారు. దీనికి ‘ఏం మాట్లాడినా మా గురించేనేమోనని ఆపాదించుకుంటున్నారు. ఇది ఎన్నికల సమయం కాబట్టి నా ఉద్దేశాలను చెపుతున్నానే కానీ.. ఎవరినీ ఉద్దేశించి చెప్పింది కాదు’ అని వివరణ ఇచ్చారు. తాను చెప్పింది జీవిత సత్యమని తెలిపారు.

Similar News

News July 5, 2024

రాష్ట్ర పునర్‌నిర్మాణమే లక్ష్యం: చంద్రబాబు

image

రెండు మంత్రి పదవులు తప్ప కేంద్రం నుంచి ఎలాంటి హామీలు ఆశించలేదని ఢిల్లీ పర్యటన ముగిసిన సందర్భంగా AP CM చంద్రబాబు అన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఎంతో నష్టం జరిగిందని, రాష్ట్ర పునర్‌నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. దక్షిణాదిలో ఎక్కడా లేని వనరులు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. నదుల అనుసంధానంతో అద్భుతాలు చేయొచ్చని వివరించారు. ఢిల్లీ నుంచి నేరుగా HYD బయల్దేరిన ఆయన రేపు TG CM రేవంత్‌తో భేటీ కానున్నారు.

News July 5, 2024

బ్రిటన్ కొత్త ప్రధానిగా నియమితులైన స్టార్మర్

image

బ్రిటన్ ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్ పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్ ప్రధానిగా నియమితులయ్యారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు ఆహ్వానించిన బ్రిటన్ రాజు ఛార్లెస్ స్టార్మర్‌ను ప్రధానిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. లేబర్ పార్టీ నుంచి పీఎంగా ఎన్నికైన ఏడో వ్యక్తిగా స్టార్మర్ నిలిచారు. లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో స్టార్మర్ ఆయన సతీమణితో కలిసి పాల్గొననున్నారు.

News July 5, 2024

నిన్నటి ఈవెంట్ బీసీసీఐకి ఓ స్ట్రాంగ్ మెసేజ్: ఆదిత్య ఠాక్రే

image

నిన్న ముంబైలో జరిగిన T20 వరల్డ్ కప్ విజయోత్సవం ముంబై నుంచి WC ఫైనల్‌ను తీసివేయొద్దనే ఓ స్ట్రాంగ్ మెసేజ్‌ని బీసీసీఐకి ఇచ్చాయని శివసేన(UBT) నేత ఆదిత్య ఠాక్రే ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ గత ఏడాది వన్డే WC ఫైనల్ ముంబైలో కాకుండా అహ్మదాబాద్‌లో నిర్వహించడం గురించే చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహించినా అభిమానులు పోటెత్తేవారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.