News October 17, 2024
మూసీ ప్రాజెక్టులో ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదు: రేవంత్
TG: రాష్ట్రాన్ని, నగరాన్ని బాగుచేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు ఇప్పటికే ఆస్తి, అంతస్తులు, పదవి అన్నీ వచ్చాయని చెప్పారు. ఈ సమయంలో ఎవ్వరినో మోసం చేయాల్సిన అవసరం లేదన్నారు. మూసీ ప్రాజెక్టుకు వెచ్చించే రూ.1.50 లక్షల కోట్లలో తాము ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదని సీఎం తెలిపారు. తమ మంత్రులు కూడా ప్రజలకు మేలు చేసేందుకే పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
Similar News
News October 17, 2024
‘పుష్ప-2’ సంచలనం!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ రిలీజ్కు ముందే సంచలనాలు నమోదు చేస్తోంది. సినిమా DEC 6న రిలీజ్ కానుండగా అప్పుడే రూ.900 కోట్ల బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. డిజిటల్ & శాటిలైట్ రైట్స్ను ఆల్టైమ్ రికార్డు ధరకు విక్రయించినట్లు టాక్. థియేట్రికల్ రైట్సే రూ.650 కోట్లకు కోట్ చేశారని సమాచారం. ‘పుష్ప’కు సీక్వెల్గా వస్తుండటంతో భారీ అంచనాలున్నాయి.
News October 17, 2024
సీఎం రేవంత్ కామెంట్స్పై రేపు మాట్లాడతా: KTR
TG: సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్మీట్పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మూసీ పునరుజ్జీవం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను రేపు సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్ భవన్లో ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తానని ఆయన ట్వీట్ చేశారు. మూసీ ప్రాజెక్ట్ గురించి సీఎం రేవంత్ చేసిన కామెంట్స్పై మాట్లాడతానని చెప్పారు.
News October 17, 2024
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు
AP: ఈనెల 22న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD ప్రకటించింది. దీని ప్రభావంతో రేపు కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, NTR, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని వెల్లడించింది. కాగా వాయుగుండం ఇవాళే తీరం దాటిన విషయం తెలిసిందే.