News October 17, 2024
మూసీ ప్రాజెక్టులో ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదు: రేవంత్

TG: రాష్ట్రాన్ని, నగరాన్ని బాగుచేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు ఇప్పటికే ఆస్తి, అంతస్తులు, పదవి అన్నీ వచ్చాయని చెప్పారు. ఈ సమయంలో ఎవ్వరినో మోసం చేయాల్సిన అవసరం లేదన్నారు. మూసీ ప్రాజెక్టుకు వెచ్చించే రూ.1.50 లక్షల కోట్లలో తాము ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదని సీఎం తెలిపారు. తమ మంత్రులు కూడా ప్రజలకు మేలు చేసేందుకే పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
Similar News
News January 30, 2026
హార్వర్డ్లో కోర్స్ పూర్తి చేసుకున్న CM రేవంత్

హార్వర్డ్ కెనడీ స్కూల్లో TG CM రేవంత్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తయింది. ‘లీడర్షిప్ ఇన్ ది 21st సెంచరీ’ అనే ప్రోగ్రామ్ని JAN 25 నుంచి నిర్వహించారు. CM సహా 62 మంది విద్యార్థులు ఈ కోర్సు పూర్తి చేశారు. వారికి కెనడీ స్కూల్ ఫ్యాకల్టీ సర్టిఫికెట్స్ అందజేశారు. రోజూ ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ని నిర్వహించారు.
News January 30, 2026
ఒక్క రోజే రూ.10వేలు తగ్గిన కేజీ వెండి ధర

వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధర ఇవాళ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో KG సిల్వర్ రేటు రూ.10వేలు పతనమై రూ.4,15,000కు చేరింది. కాగా నిన్న ఒక్క రోజే కేజీ వెండి ధర రూ.25వేలు పెరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. అటు బంగారం ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి.
News January 30, 2026
NCERTలో 173 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

<


