News April 7, 2025
CTలో చోటు దక్కకపోవడం నిరాశపరిచింది: సిరాజ్

ఛాంపియన్స్ ట్రోఫీలో తనకు చోటు దక్కకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయానని GT పేసర్ మహ్మద్ సిరాజ్ చెప్పారు. ‘టీమ్ ఇండియా తరఫున కంటిన్యూగా ఆడుతుండగా ఒక్కసారిగా డ్రాప్ చేయడంపై ఎన్నో డౌట్స్ వస్తాయి. అందుకే నా బలహీనతలపై దృష్టి పెట్టాను. ఫిట్నెస్, ఆటను మెరుగుపర్చుకున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ ముందు రాణించడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. నిన్న 4 వికెట్లతో సిరాజ్ SRHను దెబ్బతీశారు.
Similar News
News April 9, 2025
MPలో విద్యార్థుల అటెండెన్స్.. ‘జై హింద్’ అనాలి

మధ్యప్రదేశ్లో విద్యార్థుల అటెండెన్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ‘ప్రజెంట్ సర్/మేడమ్’కు బదులుగా ‘జై హింద్’ అని చెప్పాలని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. క్యాబినెట్ మినిస్టర్ కున్వర్ విజయ్ షా కూడా దీనిపై ప్రకటన చేసినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. కాగా, హరియాణా ప్రభుత్వం కూడా విద్యార్థులు, టీచర్లు ‘గుడ్ మార్నింగ్’కు బదులుగా ‘జై హింద్’ చెప్పేలా చర్యలు తీసుకుంది.
News April 9, 2025
ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలి: KTR

పెట్రోల్, డీజిల్, LPG ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR లేఖ రాశారు. ‘ఇంధన ధరలు పెంచి మరోసారి ప్రజల వెన్ను విరిచేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ దేశాల్లోకెల్లా చమురు, LPG ధరలు INDలోనే ఎక్కువ. ముడి చమురు ధరలు అత్యల్ప స్థాయికి పడిపోతే ఇంధన ధరలు ఎందుకు పెంచారో చెప్పండి. ధరల పెంపును ఉపసంహరించుకోవాలని BRS డిమాండ్ చేస్తోంది’ అని KTR ట్వీట్ చేశారు.
News April 9, 2025
ట్రంప్ నిర్ణయం దెబ్బకొడుతుందా?

అధిక టారిఫ్స్ విధిస్తూ ప్రపంచ దేశాలు తమను దోచుకుంటున్నాయని US ప్రెసిడెంట్ ట్రంప్ చెబుతున్నారు. అందుకే తామూ సుంకాలు పెంచామని స్పష్టం చేశారు. దీనివల్ల అమెరికాలో పరిశ్రమలు, ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్ నమ్మకం. అయితే USలో బ్లూ కాలర్ జాబ్స్ చేసేందుకు యువత సిద్ధంగా లేరు. అక్కడి కంపెనీలు చీప్ లేబర్ కోసం చూస్తాయి. విదేశీయులు లేకుండా అగ్రరాజ్యం మనుగడ కష్టం. మరి ట్రంప్ నిర్ణయం ఎటు దారితీస్తుందో చూడాలి.