News February 27, 2025
రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలి: మంత్రి లోకేశ్

AP: శివుడిని తలచుకున్నా, ఆయన విగ్రహం చూసినా తనకు ఎంతో బలం వస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘బాబు గారి అరెస్ట్ తర్వాత నా ఆలోచన విధానం మారింది. శివుడిపై భక్తి చాలా పెరిగింది. రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలనే నమ్మకం కలిగింది. నా యువగళం పాదయాత్రలో స్వయంగా శివుడే నన్ను నడిపించాడు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News February 5, 2026
కలలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తే?

కలలో ఎర్రటి చంద్రుడిని చూడటం రాబోయే కష్టాలకు/మానసిక సంఘర్షణలకు సంకేతంగా నమ్ముతారు. స్వప్న శాస్త్రం ప్రకారం ఇది కుటుంబంలో మనస్పర్థలు, అనవసరమైన గొడవలు, ఆందోళనలను సూచిస్తుంది. మీ మనస్సులోని భయాలు లేదా అదుపులో లేని భావోద్వేగాలకు ఇది ప్రతిబింబం. ఇలాంటి కలలు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా, మనశ్శాంతి కోసం ధ్యానం, యోగా చేయడం మంచిది. పరిస్థితులను ప్రశాంతంగా విశ్లేషించడం ద్వారా ఈ ప్రతికూలతలను అధిగమించవచ్చు.
News February 5, 2026
4 వారాల్లోగా పూర్తిస్థాయి DGPని నియమించాలి: SC

TG: 4 వారాల్లోగా పూర్తిస్థాయి DGPని నియమించాలని UPSCని SC ఆదేశించింది. రెగ్యులర్ DGPల స్థానంలో యాక్టింగ్, అడహక్ నియామకాలు పెరిగాయని మండిపడింది. ‘దీనివల్ల సీనియర్లకు అన్యాయం జరుగుతోంది. TG ఒక్కటే కాదు జాబితాలు పంపని రాష్ట్రాలు ఇంకా ఉన్నాయి. సకాలంలో జాబితాల కోసం రాష్ట్రాలకు లేఖలు రాసే అధికారం UPSCకి ఇస్తున్నాం. రాష్ట్రాలు స్పందించకుంటే వాటి జవాబుదారీతనంపై చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించింది.
News February 5, 2026
22 ఏళ్లలో తొలిసారి.. PM స్పీచ్ లేకుండానే ధన్యవాద తీర్మానం పాస్

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్సభ ఆమోదం తెలిపింది. PM మోదీ స్పీచ్ లేకుండానే ఆమోదం తెలపడం గమనార్హం. ఇలా జరగడం 2004 తర్వాత ఇదే తొలిసారి. USతో ట్రేడ్ డీల్పై విపక్ష నేతల నిరసనలతో ప్రధాని ప్రసంగించకుండానే నిన్న లోక్సభ వాయిదా పడింది. ఇవాళ సభ ప్రారంభమవగానే తీర్మానాన్ని ఆమోదించినట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. దీంతో నేడే కేంద్ర బడ్జెట్పై చర్చ మొదలయ్యే అవకాశం ఉంది.


