News February 27, 2025
రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలి: మంత్రి లోకేశ్

AP: శివుడిని తలచుకున్నా, ఆయన విగ్రహం చూసినా తనకు ఎంతో బలం వస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘బాబు గారి అరెస్ట్ తర్వాత నా ఆలోచన విధానం మారింది. శివుడిపై భక్తి చాలా పెరిగింది. రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలనే నమ్మకం కలిగింది. నా యువగళం పాదయాత్రలో స్వయంగా శివుడే నన్ను నడిపించాడు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News February 6, 2026
RRR ఉత్తర భాగానికి గ్రీన్ సిగ్నల్

TG: Hyd చుట్టూ 162KM మేర నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించిన DPR సిద్ధమైందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. LSలో MP ఈటల రాజేందర్ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు తెలిపారు. భూసేకరణ వ్యయంలో 50% భారం పంచుకునేందుకు TG అంగీకరించిందన్నారు. రాయల్టీ మినహాయింపు, GSTలోని రాష్ట్ర వాటా చెల్లింపునకూ ఓకే చెప్పిందన్నారు. ఈ ఏడాది CRIF నుంచి రూ.367.17 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
News February 6, 2026
శుక్ర దోషం ఎలా ఏర్పడుతుంది?

ఇందుకు చాలా కారణాలున్నాయి. జాతకంలో శుక్రుడు నీచ స్థితిలో ఉండకూడదు. దీనివల్ల దోషం ఏర్పడి శుభ ఫలితాలు తగ్గుతాయి. సౌఖ్యాలు దూరమవుతాయి. శుక్రుడు రాహువు, కేతువు, శని గ్రహాలతో కలిసినా దోషం ఏర్పడుతుంది. ఇది వ్యక్తి నైతికతను, బంధాలను ప్రభావితం చేస్తుంది. జాతక చక్రంలో 6, 8, 12వ ఇళ్లలో శుక్రుడు ఉండటం మంచిది కాదు. ఉంటే అనారోగ్యం, అప్పులు కలుగుతాయి. పూర్వజన్మ కర్మల వల్ల కూడా శుక్ర దోషం ఏర్పడవచ్చు.
News February 6, 2026
జూన్ 1న ఈఏపీసెట్ ఫలితాలు!

AP: ఈఏపీసెట్కు మార్చి 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 23న ప్రాథమిక కీ, జూన్ 1న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంది. ‘ఈసెట్కు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 23న పరీక్ష, మే 7న రిజల్ట్స్ రిలీజ్ చేస్తాం. ఐసెట్కు మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 2న పరీక్ష, 16 ఫలితాలు ప్రకటిస్తాం’ అని పేర్కొంది.


