News February 27, 2025

రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలి: మంత్రి లోకేశ్

image

AP: శివుడిని తలచుకున్నా, ఆయన విగ్రహం చూసినా తనకు ఎంతో బలం వస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘బాబు గారి అరెస్ట్ తర్వాత నా ఆలోచన విధానం మారింది. శివుడిపై భక్తి చాలా పెరిగింది. రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలనే నమ్మకం కలిగింది. నా యువగళం పాదయాత్రలో స్వయంగా శివుడే నన్ను నడిపించాడు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News February 19, 2026

IIM లఖ్‌నవూలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

<>IIM<<>> లఖ్‌నవూ ఎంటర్‌ప్రైజ్ ఇంక్యుబేషన్ సెంటర్‌లో 4 అసిస్టెంట్ మేనేజర్ ప్రోగ్రామ్స్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీటెక్, ఎంబీఏ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఏడాదికి రూ.3.60లక్షలు-రూ.5.40లక్షలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iiml.ac.in

News February 19, 2026

విషవాయువు పీల్చి 37 మంది మృతి

image

నైజీరియాలోని ప్లాట్యూ స్టేట్‌లో మైనింగ్‌కు వెళ్లి 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గనుల్లో సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులు లీక్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇది ప్రభుత్వం క్లోజ్ చేసిన గని అని, కానీ స్థానికులు అక్రమంగా మైనింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

News February 19, 2026

₹10 లక్షల కోట్లతో అంబానీ AI ప్లాన్స్

image

ఢిల్లీ వేదికగా జరుగుతున్న AI సదస్సులో ముకేశ్ అంబానీ, TATA ఛైర్మన్ చంద్రశేఖరన్ కీలక ప్రకటనలు చేశారు. రిలయన్స్ రాబోయే ఏడేళ్లలో ఏకంగా ₹10లక్షల కోట్లు AI మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టనున్నట్లు అంబానీ తెలిపారు. ఇంటెలిజెన్స్‌తో భారత్‌ను అనుసంధానిస్తామని పేర్కొన్నారు. మరోవైపు INDలో తొలి AI ఆప్టిమైజ్డ్ డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నట్లు.. దీనికోసం OpenAIతో డీల్ చేసుకున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది.