News February 27, 2025
రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలి: మంత్రి లోకేశ్

AP: శివుడిని తలచుకున్నా, ఆయన విగ్రహం చూసినా తనకు ఎంతో బలం వస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘బాబు గారి అరెస్ట్ తర్వాత నా ఆలోచన విధానం మారింది. శివుడిపై భక్తి చాలా పెరిగింది. రాముడిలానే కాదు.. కొన్నిసార్లు శివుడిలా ఉండాలనే నమ్మకం కలిగింది. నా యువగళం పాదయాత్రలో స్వయంగా శివుడే నన్ను నడిపించాడు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News February 11, 2026
ఇలా చేస్తే గ్యాస్ సిలిండర్ లీక్ అవుతుంది!

గ్యాస్ సిలిండర్ నిండుగా ఉన్నప్పుడు చాలామంది దానిని కింద పడుకోబెట్టి భద్రపరుస్తుంటారు. అయితే ఇలా చేయడం అత్యంత ప్రమాదకరమని కేంద్ర పెట్రోలియం శాఖ హెచ్చరిస్తోంది. సిలిండర్ను పడుకోబెట్టడం వల్ల గ్యాస్ లీకేజీ అయి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. గ్యాస్ లీకేజీలను అరికట్టేందుకు సిలిండర్ను ఎల్లప్పుడూ నిలువుగానే ఉంచాలని సూచించింది. SHARE IT
News February 11, 2026
దర్యాప్తు రోజే ఎప్స్టీన్ ద్వీపానికి 330 గ్యాలన్ల యాసిడ్.. ఏం చేశారు?

ఎప్స్టీన్ కేసులో తాజాగా విడుదలైన పత్రాలు విస్తుపోయే విషయాలను బయటపెట్టాయి. 2018 జూన్ 12న FBI దర్యాప్తు మొదలైన రోజే అతని ప్రైవేట్ ఐలాండ్కు 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ డెలివరీ అయినట్లు రశీదులు లభించాయి. మృతదేహాలను లేదా సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకే ఇంత భారీ మొత్తంలో యాసిడ్ కొన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే RO ప్లాంట్ నిర్వహణ కోసం దీనిని వాడేవారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
News February 11, 2026
గోల్డ్ బాండ్స్: ₹లక్ష పెట్టుబడి ₹3.8 లక్షలైంది!

నేడు ప్రీమెచ్యూర్కు వస్తున్న 2019-20 (సిరీస్ IX) గోల్డ్ బాండ్ల ధర గ్రాముకు ₹15,440గా నిర్ణయించారు. ఐదేళ్ల క్రితం ₹4,070 వద్ద కొన్నవారికి ఇప్పుడు ఏకంగా 3.8 రెట్ల లాభం లభించనుంది. అంటే ₹1 లక్ష పెట్టుబడి సుమారు ₹3.8 లక్షలైంది. దీనికి అదనంగా ఏటా 2.5% వడ్డీ కూడా లభిస్తుంది. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడమే ఈ భారీ లాభాలకు కారణం.


