News March 8, 2025
మృత్యుకుంభ్ కాదు.. మృత్యుంజయ మహా కుంభ్: యోగి

విమర్శకులు మహా కుంభమేళాను ‘మృత్యుకుంభ్’గా పిలిస్తే, భక్తులు దాన్ని ‘మృత్యుంజయ మహా కుంభ్’గా మార్చారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 66 కోట్ల మంది భక్తులు తరలివచ్చి భారతదేశ ఐక్యతను చాటి, విమర్శకుల నోటికి తాళం వేశారని తెలిపారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఆరోజు వచ్చిన 8 కోట్ల భక్తుల భద్రతకు తాము శాయశక్తులా ప్రయత్నించామని ‘ఇండియా టుడే కాంక్లేవ్’లో ఆయన చెప్పారు.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


