News October 9, 2025
నర్సీపట్నం కాదు.. హైకోర్టుకు వెళ్లండి: TDP

AP: మాజీ CM జగన్ నర్సీపట్నం పర్యటనపై TDP సెటైర్లు వేసింది. నర్సీపట్నం కాకుండా హైకోర్టుకు వెళ్లి లాజిక్కులు చెప్పాలని సూచించింది. PPP మోడల్పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసింది. ‘PPP మోడల్లో వైద్య కళాశాలలు నిర్మించే అంశంలో జోక్యం చేసుకోలేం. అలా నిర్మిస్తే తప్పేంటి? ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటే మంచిదే కదా’ అని కోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఉన్న వార్తను ట్వీట్ చేసింది.
Similar News
News October 9, 2025
ఉదయం ఎన్నికల నోటిఫికేషన్, సాయంత్రం స్టే

తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎన్నికల కోసం పల్లెలు ఏడాదిగా ఎదురుచూస్తుంటే అనేక గందరగోళాలు, వివాదాల అనంతరం ఎట్టకేలకు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లను ఇవ్వడాన్ని సవాల్ చేయడంపై హైకోర్టు రెండ్రోజులు విచారించి తాజాగా స్టే ఇచ్చింది. దీంతో ఈ ఉదయం గం.10:30కి వచ్చిన తొలి ఫేజ్ నోటిఫికేషన్ సాయంత్రం గం.4కు అర్థరహితంగా మారిపోయింది.
News October 9, 2025
ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయనుంది?

TG: బీసీ రిజర్వేషన్లు 42% పెంచడంపై HCలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. GO-9తో పాటు విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్పైనా ధర్మాసనం స్టే విధించింది. దీంతో ఇప్పుడు INC సర్కార్ ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. ముందే నిర్ణయించుకున్నట్లు ‘ప్లాన్-బి’ ప్రకారం పార్టీ తరఫున బీసీలకు 42% సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఇలా చేయాలంటే మళ్లీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
News October 9, 2025
SEBIలో 110 పోస్టులు

SEBI 110 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. OCT 30 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోస్టును బట్టి BE, బీటెక్, LLB, PG, CFA, CA, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫేజ్1, ఫేజ్ 2 రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWDలకు రూ.100. వెబ్సైట్: https://www.sebi.gov.in/