News May 18, 2024

హార్దిక్‌పై వేటు.. IPL-2025లో ఫస్ట్ మ్యాచ్‌‌కు దూరం

image

LSGతో జరిగిన మ్యాచ్‌లో MI జట్టు స్లో ఓవర్ రేట్‌ నియమాన్ని ఉల్లంఘించింది. ఈ టోర్నీలో మూడోసారి స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు IPL యాజమాన్యం కెప్టెన్ హార్దిక్ పాండ్యకు రూ.30 లక్షలు జరిమానా విధించింది. దీంతోపాటు తరువాతి మ్యాచ్‌ ఆడకుండా నిషేధించింది. IPL2024లో MI నిన్న చివరి మ్యాచ్ ఆడగా.. హార్దిక్ 2025 IPLలో తన మొదటి మ్యాచ్‌కు దూరం కానున్నారు.

Similar News

News February 7, 2026

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

image

నేపాల్ యాక్టర్ సునీల్ థాపా(68) కన్నుమూశారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో కాఠ్‌మాండూ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 40 ఏళ్ల కెరీర్‌లో 300కి పైగా నేపాలీ, బాలీవుడ్, భోజ్‌పురి సినిమాల్లో నటించారు. హిందీలో ‘మేరీ కోమ్’, తెలుగులో ‘మిరాయ్’ మూవీలోనూ కనిపించారు. ఆయన మృతిపై సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News February 7, 2026

దేశంలో ముస్లిం జనాభా హిందువులను దాటదు: అసదుద్దీన్

image

దేశంలో హిందూ జనాభాను ముస్లింలు ఎప్పటికీ అధిగమించలేరని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ముస్లిం జనాభా స్టెబిలైజ్ అవుతుందన్నారు. ‘20 ఏళ్ల తర్వాత వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. కానీ ద్రవ్యోల్బణం, ఇతర అంశాలపై ఆలోచించకుండా ముస్లిం జనాభా ఎక్కువవుతోందని గతంలో కొందరు అన్నారు. వృద్ధుల సంఖ్య పెరిగితే దేశంపై ఎంత ప్రభావం పడుతుందనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. పిల్లల్ని కనాలని చెబుతున్నారు’ అని విమర్శించారు.

News February 7, 2026

నెదర్లాండ్స్.. ఓడినా వణికించింది!

image

T20 WCలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన <<19075448>>తొలి మ్యాచ్‌<<>>లో నెదర్లాండ్స్ చివరి దాకా పోరాడింది. ఒకానొక దశలో గెలుపు దిశగా సాగింది. పాక్ 7 వికెట్లు కూల్చి 12 బంతుల్లో 29 పరుగులు కొట్టాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది. కానీ 19వ ఓవర్లో ఒత్తిడికి గురైంది. ఒక క్యాచ్ కూడా మిస్ చేసుకుంది. ఫహీమ్ అష్రఫ్ ధాటికి 24 పరుగులు సమర్పించుకుంది. ఇదే మ్యాచ్‌ను మలుపుతిప్పింది. ఓడినా సరే పాక్‌కు ముచ్చెమటలు పట్టించింది.