News May 18, 2024
హార్దిక్పై వేటు.. IPL-2025లో ఫస్ట్ మ్యాచ్కు దూరం

LSGతో జరిగిన మ్యాచ్లో MI జట్టు స్లో ఓవర్ రేట్ నియమాన్ని ఉల్లంఘించింది. ఈ టోర్నీలో మూడోసారి స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు IPL యాజమాన్యం కెప్టెన్ హార్దిక్ పాండ్యకు రూ.30 లక్షలు జరిమానా విధించింది. దీంతోపాటు తరువాతి మ్యాచ్ ఆడకుండా నిషేధించింది. IPL2024లో MI నిన్న చివరి మ్యాచ్ ఆడగా.. హార్దిక్ 2025 IPLలో తన మొదటి మ్యాచ్కు దూరం కానున్నారు.
Similar News
News December 25, 2025
భవిష్యత్లో సిరులు కురిపించనున్న కాపర్!

రానున్న రోజుల్లో కాపర్ (రాగి) ధరలు మరింతగా పెరుగుతాయని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్న టన్ను కాపర్ ధర $12వేలు దాటింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు, పవర్ గ్రిడ్ నిర్మాణాలకు ఇవి ఎంతో కీలకం కాబట్టి ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. 2030 నాటికి కాపర్ డిమాండ్ 60% పెరుగుతుందని అంచనా వేశారు. బంగారం, వెండిలాగే కాపర్పైనా పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు.
News December 25, 2025
వార్నర్ రికార్డు సమం చేసిన రోహిత్

సుమారు 7 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ భారీ శతకంతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచులో 155 పరుగులు చేసిన హిట్ మ్యాన్ లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సార్లు 150+ స్కోర్ చేసిన ప్లేయర్గా డేవిడ్ వార్నర్(9) రికార్డును సమం చేశారు. అంతేకాకుండా అనుస్తుప్ మజుందార్(39y-బెంగాల్) తర్వాత VHTలో శతకం బాదిన అతిపెద్ద వయస్కుడిగానూ రోహిత్(38y 238d) నిలిచారు.
News December 25, 2025
త్వరలో కొత్త మెయిల్ ఐడీలు! గూగుల్ కీలక నిర్ణయం

త్వరలో జీమెయిల్ యూజర్ ఐడీ మార్చుకునే ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది. కొత్త యూజర్ ఐడీతోపాటు పాత ఐడీ యాక్టివ్గానే ఉంటుందని, ఇన్బాక్స్ ఒకటేనని తెలిపింది. పాత ఐడీ మళ్లీ పొందాలంటే 12నెలలు ఆగాల్సిందేనని చెప్పింది. జీమెయిల్ అకౌంట్తో లింకైన ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, ఆధార్ యూజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ ఫీచర్ దశలవారీగా అమలులోకి వస్తుందని తెలిపింది.


