News October 29, 2024
పంత్ కాదు.. భారత్ని పూజారా కాపాడాడు: టిమ్ పెయిన్

2020-21లో తమ దేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో భారత్ను కాపాడింది పూజారానేనని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పెయిన్ పేర్కొన్నారు. ‘ఆ సిరీస్ విజయంలో అందరూ పంత్ గురించే మాట్లాడతారు. నిజానికి భారత్ను గెలిపించింది పుజారా. మాకు అతడో గోడలా అడ్డం నిలబడిపోయాడు. బౌలర్లను విసిగించి, అలసిపోయేలా చేశాడు. బంతి తగిలి ఒళ్లు కమిలిపోతున్నా ఓ రాయిలా క్రీజులో పాతుకుపోయాడు’ అని కొనియాడారు.
Similar News
News January 19, 2026
‘రాజాసాబ్’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.139.25 కోట్లు(నెట్) వసూలు చేసినట్లు Sacnilk తెలిపింది. నిన్న ఈ సినిమా రూ.2.50 కోట్లు రాబట్టినట్లు అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో రూ.180 కోట్ల నెట్ కలెక్షన్స్ దాటినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
News January 19, 2026
ECILలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని <
News January 19, 2026
వరిలో అగ్గి తెగులు – నివారణకు సూచనలు

వరి దుబ్బు చేసే దశలో అగ్గి తెగులు కనిపిస్తుంది. దీని వల్ల వరి పైర్లలో ఆకులపై నూలు కండె ఆకారం మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద, వెన్నుల మీద గోధుమ రంగు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొక్క వెన్నువిరిగి వేలాడుతుంది. ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 75% 0.6gm లేదా అజాక్సీస్ట్రోబిన్+టెబుకోనజోల్ 2 ml కలిపి పిచికారీ చేసుకోవాలి.


