News July 30, 2024
రైల్వే మంత్రి కాదు.. రీలు మంత్రి: ప్రతిపక్షాలు

తరచూ రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడంపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్పై ధ్వజమెత్తాయి. ట్రైన్ యాక్సిడెంట్లలో ప్రభుత్వం రికార్డు క్రియేట్ చేయాలని చూస్తోందని సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ విమర్శించగా, ఇది అసలు పాలనేనా అని బెంగాల్ సీఎం మమత ప్రశ్నించారు. మంత్రి వైష్ణవ్ రైల్వేకు కాక ‘ఇన్స్టా రీల్’కు మంత్రి అని శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎద్దేవా చేశారు.
Similar News
News December 25, 2025
మహిళలపై కంట్రోల్ కోసమే ఇదంతా: అనసూయ

పాత తరాలు అలవాటుపడ్డ ఆలోచనలను మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని నటి <<18662962>>అనసూయ<<>> పేర్కొన్నారు. ‘కొంతమంది వయసు ఆధారంగా నన్ను తక్కువ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఆలోచనున్న వాళ్లు ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం, బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది’ అని ట్వీట్ చేశారు.
News December 25, 2025
రంగ రాయ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

AP: కాకినాడలోని రంగ రాయ మెడికల్ కాలేజీలో 34 పారా మెడికల్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి ఇంటర్, DCLT, BSc న్యూరో ఫిజియాలజీ, న్యూరో టెక్నాలజీ, BSc డయాలసిస్ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, BSc ఇమేజింగ్ టెక్నాలజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు టెన్త్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. https://rmckakinada.com/
News December 25, 2025
బంగ్లాకు తారిఖ్ రీఎంట్రీ: భారత్కు కలిసొచ్చేనా?

17 ఏళ్ల తర్వాత బంగ్లా డార్క్ ప్రిన్స్ తారిఖ్ రెహమాన్ స్వదేశానికి రానుండడాన్ని పెను మార్పుగా దౌత్యవేత్తలు అభివర్ణిస్తున్నారు. భారత్కు సానుకూల అంశంగా విశ్లేషిస్తున్నారు. బంగ్లాలో రెచ్చిపోతున్న మత ఛాందసవాదులు, జమాత్ ఏ ఇస్లామీ లాంటి యాంటీ ఇండియా, పాకిస్థాన్ అనుకూల శక్తులకు చెక్ పెట్టడానికి తారిఖ్ నాయకత్వంలోని BNP కీలకం కానుంది. అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడితే భారత్తో సంబంధాలు మెరుగుపడతాయి.


