News March 18, 2024
పదో తరగతి విద్యార్థులకు గమనిక…. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఖమ్మం జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. 24గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటుండగా, 83318 51510 నంబర్ కు ఫోన్ చేసి సమస్యలు తెలపొచ్చని తెలిపారు. అయితే, సెంటర్లు ఏర్పాటుచేసిన కొన్ని పాఠశాలల పేర్లు ఒకే తరహాలో ఉన్నందున కేంద్రాలను ముందు రోజే చూసుకోవాలన్నారు.
Similar News
News December 15, 2025
రెండో విడత ఎన్నికలు.. ఏ పార్టీ ఎన్ని గెలిచిందంటే..!

ఖమ్మం జిల్లాలో జరిగిన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. 6 మండలాల్లో మొత్తం 183 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ పార్టీ-117, BRS-40, CPI-04, CPM-14, TDP-1, ఇండిపెండెంట్ అభ్యర్థులు 7 స్థానాల్లో గెలుపొందారు. అటు మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈనెల 17న జరగనున్నాయి.
News December 15, 2025
ఖమ్మం జిల్లాలో రెండో దశ ఎన్నికలు.. పార్టీల బలాబలాలు

▶ కూసుమంచి(41 స్థానాలు): CONG-28, BRS-12, ఇతరులు-1
▶ కామేపల్లి(24): CONG-16, BRS-6, CPI-1, TDP-1
▶ ఖమ్మం రూరల్(21): 21 CONG-9, BRS-5, CPI-3, CPM-4
▶ ముదిగొండ(25): CONG-17, BRS-2, CPM-6
▶ నేలకొండపల్లి(32): CONG-20, BRS-7, CPM-2, ఇతరులు-3
▶ తిరుమలాయపాలెం(40): CONG-27, BRS-8, CPM-2, ఇతరులు-3.
News December 14, 2025
ఖమ్మం: రెండో విడత.. ఖాతా తెరిచిన కాంగ్రెస్

కామేపల్లి మండలం పొన్నెకల్లు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ భూమిక గెలుపొందారు. సమీప అభ్యర్థిపై ఆమె 603 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భూమిక గెలుపు పట్ల కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గింజల నర్సింహారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. తనను గెలిపించిన ఓటర్లకు భూమిక కృతజ్ఞతలు తెలిపారు.


