News March 18, 2024
పదో తరగతి విద్యార్థులకు గమనిక…. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఖమ్మం జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. 24గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటుండగా, 83318 51510 నంబర్ కు ఫోన్ చేసి సమస్యలు తెలపొచ్చని తెలిపారు. అయితే, సెంటర్లు ఏర్పాటుచేసిన కొన్ని పాఠశాలల పేర్లు ఒకే తరహాలో ఉన్నందున కేంద్రాలను ముందు రోజే చూసుకోవాలన్నారు.
Similar News
News December 10, 2025
ఖమ్మం: 18 రకాల కార్డులతో ఓటేయవచ్చు: కలెక్టర్

ఈ నెల 11, 14, 17 తేదీల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరు గుర్తింపు కార్డు లేని పక్షంలో, ఇతర 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని వెంట తీసుకెళ్లవచ్చని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ప్రతి ఓటరు ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.
News December 10, 2025
ఈ-కేవైసీ కారణంతో రద్దయిన రేషన్ కార్డులెన్ని?:ఎంపీ

దేశంలో ఈ-కేవైసీ చేయించుకోని కారణంగా రద్దయిన రేషన్ కార్డుల గణాంకాలను తెలపాలని ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి బుధవారం లోక్సభలో కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్ర వినియోగదారులు ఆహార ప్రజాపంపిణీ సహాయ మంత్రి నిముబెన్ జయంతి బాయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అక్టోబరు నాటికి రాష్ట్రాల వారీగా రద్దయిన కార్డులు, ప్రస్తుత కార్డుల వివరాలను ఆమె సభకు అందించారు.
News December 10, 2025
ఖమ్మంలో తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధం

ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల్లోని 172 సర్పంచ్, 1,415 వార్డు స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి 1గంట వరకు పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ విడతలో 2,41,137 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 2,089 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసి, 4,220 మంది సిబ్బందిని విధుల్లో నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.


