News September 10, 2024
ప్రముఖ రచయిత నటేశ్వర శర్మ కన్నుమూత

TG: ప్రముఖ రచయిత, అష్టావధాని అయాచితం నటేశ్వర శర్మ కన్నుమూశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన ఆయన అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన రచనలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2023లో దాశరథి పురస్కారంతో సత్కరించింది. 1956లో జన్మించిన నటేశ్వర శర్మ సంస్కృతం, తెలుగు భాషల్లో 50కి పైగా రచనలు రాశారు. వందకు పైగా అష్టావధానాలు చేశారు. ఆముక్తమాల్యదపై ఆయన విమర్శనా గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు.
Similar News
News January 16, 2026
సొంతింటి ‘బడ్జెట్’కు నిర్మలమ్మ బూస్ట్?

వచ్చే బడ్జెట్లో ‘అఫర్డబుల్ హౌసింగ్’కు ఊపిరిపోయాలని రియల్ ఎస్టేట్ నిపుణులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ₹45 లక్షల ధర పరిమితిని ₹75 లక్షల నుంచి ₹95 లక్షల వరకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నా సామాన్యుడికి ఇల్లు భారమవుతోందని.. పన్ను రాయితీలు, అద్దె గృహాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హోమ్ లోన్ వడ్డీ మినహాయింపును ₹5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.
News January 16, 2026
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి 5 ఏళ్ల జైలు

దక్షిణ కొరియాలో ‘మార్షల్ లా’ విధించి విఫలమైన మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అరెస్టు కాకుండా అధికారులను అడ్డుకోవడం, పత్రాల ఫోర్జరీ వంటి కేసుల్లో ఈ తీర్పు వెలువడింది. ఆ దేశ చరిత్రలో పదవిలో ఉండగా అరెస్టయిన తొలి అధ్యక్షుడు ఆయన. అయితే ఆయనపై ఉన్న అత్యంత తీవ్రమైన ‘రాజద్రోహం’ కేసులో ప్రాసిక్యూటర్లు మరణశిక్ష కోరగా.. దానిపై ఫిబ్రవరిలో తుది తీర్పు వెలువడనుంది.
News January 16, 2026
ESIC మెడికల్ కాలేజీ&హాస్పిటల్లో ఉద్యోగాలు

నోయిడాలోని<


