News September 10, 2024
ప్రముఖ రచయిత నటేశ్వర శర్మ కన్నుమూత

TG: ప్రముఖ రచయిత, అష్టావధాని అయాచితం నటేశ్వర శర్మ కన్నుమూశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన ఆయన అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన రచనలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2023లో దాశరథి పురస్కారంతో సత్కరించింది. 1956లో జన్మించిన నటేశ్వర శర్మ సంస్కృతం, తెలుగు భాషల్లో 50కి పైగా రచనలు రాశారు. వందకు పైగా అష్టావధానాలు చేశారు. ఆముక్తమాల్యదపై ఆయన విమర్శనా గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు.
Similar News
News November 17, 2025
తమ్ముడి కులాంతర వివాహం.. అన్న దారుణ హత్య!

TG: తమ్ముడి కులాంతర వివాహం అన్న చావుకొచ్చిన ఘటన MBNR(D)లో జరిగింది. రంగారెడ్డి(D) ఎల్లంపల్లికి చెందిన రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన భవానీ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో యువతి తండ్రి వెంకటేశ్ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. రాజశేఖర్ సహకారంతోనే ఇదంతా జరిగిందని వెంకటేశ్ మరో ఐదుగురితో కలిసి రాజశేఖర్ను కిడ్నాప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపాడు.
News November 17, 2025
రాజకీయ కుటుంబాల్లో ఇంటిపోరు.. పార్టీల కుదేలు

రాజకీయాల్లో అవకాశాల కోసం ఆడబిడ్డల పోరు పొలిటికల్ ఫ్యామిలీలలో చిచ్చు పెడుతోంది. APలో జగన్ సోదరి షర్మిల, TGలో KTR చెల్లెలు కవిత బాటలోనే బిహార్లో తేజస్వి సోదరి రోహిణి బంధాలను తెంచుకున్నారు. ఇంటి పోరుతో ఆయా పార్టీలు కుదేలవుతున్నాయి. ఎన్నికలకు ముందు షర్మిల వేరుకుంపటి పెట్టుకోగా, ఎన్నికల తర్వాత కవిత, రోహిణి తమ బాధను వెళ్లగక్కారు. రానున్న రోజుల్లో ఈ గొడవలకు ముగింపు దొరుకుతుందా? వేచిచూడాల్సిందే.
News November 17, 2025
సౌదీలో ఘోర ప్రమాదం.. 42 మంది మృతి

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కాలో ప్రార్థనలు ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. ఇందులో 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముఫరహత్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది.


