News September 15, 2024

రాజీనామాలతో ఒరిగేదేం లేదు: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ఒరిగేది లేదు. ఎన్నికలకు ముందు పవన్, చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి’ అని చెప్పారు.

Similar News

News February 4, 2026

మళ్లీ పుంజుకున్న గోల్డ్ రేట్స్!

image

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతవారం స్వల్పంగా తగ్గిన పసిడి ధర ఇవాళ తిరిగి $5,000(ఔన్స్‌కు) మార్కును దాటింది. USA-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, డాలర్ బలహీనపడటం, సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లతో ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో HYD మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర ₹1,60,530కు చేరింది.

News February 4, 2026

ఆ ఏడుగురు MLAలకు మున్సి‘పోల్స్’ సవాలే

image

TG: BRS నుంచి ఎన్నికై INCకి దగ్గరగా మెలగుతున్న MLAలకు మున్సి‘పోల్స్’ సవాలుగా మారాయి. శ్రీహరి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట రావు, సంజయ్ కుమార్, కృష్ణ మోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, యాదయ్య నియోజకవర్గాల్లోని స్థానాలపై CM రేవంత్ నివేదికలు రప్పిస్తున్నారు. ఇక్కడి పార్టీ శ్రేణులు ఎన్నికల్లో ఏమేరకు సహకరిస్తాయో అన్న అనుమానాలు వారిని పీడిస్తున్నాయి. మరోవైపు ఈ మున్సిపాల్టీల్లోని తమ క్యాడర్‌ను BRS ఏకం చేస్తోంది.

News February 4, 2026

ఒక్క AI టూల్.. ₹2 లక్షల కోట్ల సంపద ఆవిరి!

image

భారతీయ IT రంగానికి నేడు బ్లాక్ వెడ్నెస్ డే అనే చెప్పాలి. AIతో సాఫ్ట్‌వేర్ కంపెనీల భవిష్యత్తుపై ఆందోళన తీవ్రమవడంతో ఇన్వెస్టర్లు IT షేర్లను భారీగా అమ్మేశారు. దీంతో ఈ ఒక్కరోజే ఈ రంగంలో ₹2 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. 2020 మార్చి తర్వాత ఇదే అతిపెద్ద పతనం. TCS, ఇన్ఫీ సహా అన్ని దేశీయ IT కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి ఉంది. అమెరికా AI సంస్థ ఆంత్రోపిక్ తెచ్చిన కొత్త ఆటోమేషన్ టూల్ ఈ పతనానికి దారితీసింది.