News September 15, 2024
రాజీనామాలతో ఒరిగేదేం లేదు: బొత్స

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వం తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ఒరిగేది లేదు. ఎన్నికలకు ముందు పవన్, చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి’ అని చెప్పారు.
Similar News
News December 30, 2025
కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

AP: లైఫ్ ట్యాక్స్ వర్తించే వాహనాలపై ఆ పన్నులో 10% చొప్పున “రోడ్ సేఫ్టీ సెస్” వసూలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఆ మొత్తాన్ని రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బదిలీ చేసి రోడ్ల మెరుగుదల, భద్రతా చర్యలకు వినియోగిస్తామని పేర్కొంది. ఈ సెస్ ద్వారా సంవత్సరానికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. GST తగ్గింపుతో వాహనాల రేట్లు తగ్గాయని, వాహనదారులకు ఈ సెస్ భారం కాబోదని తెలిపింది.
News December 30, 2025
శివతత్వం: కరుణామయ సంకల్పం

మూడో కంటితో విశ్వాన్ని భస్మం చేసే కాలరుద్రుడైనప్పటికీ భక్తుల పట్ల అపారమైన కరుణ చూపే భోళాశంకరుడి నుంచి మనమెంతో నేర్చుకోవాలి. తనను నమ్మిన వారిని ఆదుకోవడానికి ఎంతటి సాహసానికైనా పూనుకుంటాడు. బలహీనులను రక్షిస్తూ, ఆర్తులను ఆదుకుంటడు. తోటివారి పట్ల కరుణ చూపి, ఇతరుల తప్పులను క్షమించే గుణం అలవర్చుకోవడమే నిజమైన శివతత్వం. ప్రతికూలతలను జయించి, ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడం శివుడి నుంచి నేర్చుకోవాలి.
News December 30, 2025
MAIDSలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు..

న్యూఢిల్లీలోని మౌలానా అజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్(<


