News September 15, 2024

రాజీనామాలతో ఒరిగేదేం లేదు: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ఒరిగేది లేదు. ఎన్నికలకు ముందు పవన్, చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి’ అని చెప్పారు.

Similar News

News January 29, 2026

పిల్లల చర్మం పొడిబారకుండా ఉండాలంటే..

image

పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. స్నానానికి ముందు నువ్వుల నూనెలను ఒంటికి మర్దన చేసి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించాలి. సబ్బు వీలైనంత తక్కువగా వాడాలి. స్నానం తర్వాత మాయిశ్చరైజర్‌ రాయాలి. సెరమైడ్స్, గ్లిజరిన్, షియా బటర్, మ్యాంగో బటర్‌ కాంబినేషన్‌లో ఉండే వాటిని ఎంచుకోవాలి. ఇవి పిల్లల చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

News January 29, 2026

చామంతి తోటలో నత్తల నివారణకు సూచనలు

image

చామంతి తోటల్లో నత్తల దాడితో కొన్ని ప్రాంతాల్లో రైతులు నష్టపోతున్నారు. వీటి నివారణకు మెథియోకార్బ్ గుళికలు 2KGలకు, అంతే మోతాదులో వరి తవుడు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి నత్తలు తిరిగే దారిలో మొక్కల చుట్టూ చల్లాలి. అజాడిరక్టిన్(3000 P.P.M) 10ML లేదా కుంకుడు పొడి 60 గ్రాములను లీటరు నీటికి కలిపి నత్తలు తిరిగే మార్గంలో పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 29, 2026

హార్వర్డ్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌తో సీఎం రేవంత్

image

US పర్యటనలో ఉన్న తెలంగాణ CM రేవంత్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో భేటీ అయ్యారు. భారతీయ విద్యార్థుల బృందం ఆహ్వానంతో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌కు వెళ్లారు. కెరీర్ టార్గెట్స్, స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకున్నారు. విద్యార్థుల విజయాలు రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. రైజింగ్ తెలంగాణ విజన్‌ను వివరించారు. అంతర్జాతీయ పెట్టుబడులకు రాష్ట్రం కేరాఫ్‌గా మారిందని తెలిపారు.