News September 15, 2024
రాజీనామాలతో ఒరిగేదేం లేదు: బొత్స

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వం తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ఒరిగేది లేదు. ఎన్నికలకు ముందు పవన్, చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి’ అని చెప్పారు.
Similar News
News February 16, 2026
T20WCలో మిస్టరీ గర్ల్.. ఎవరంటే?

T20WC సందర్భంగా స్టేడియాల్లో మిస్టరీ బ్యూటిఫుల్ గర్ల్ ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. మ్యాచ్ల సందర్భంగా ఇతర అభిమానులతోనూ ఆమె ఫొటోలు దిగింది. దీంతో ఆ యువతి ఎవరా అని అందరూ ఆరా తీస్తున్నారు. ఇన్స్టాలో Aira Rawat పేరుతో ఉన్న అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 3K నుంచి 3.69Lకు చేరింది. చాలామంది ఆమెపై మనసు పారేసుకున్నారు. అదొక AI అకౌంట్ అని కొందరు, రియల్ పర్సన్ అని మరికొందరు పేర్కొంటున్నారు.
News February 16, 2026
వరి సన్నాలు పండించిన రైతులకు బోనస్ డబ్బు విడుదల

TG: రాష్ట్రంలో వరి సన్నాలను పండించి, విక్రయించిన రైతులకు ప్రభుత్వం బోనస్ డబ్బును విడుదల చేసింది. వానాకాలం సీజన్లో సన్నాలు అమ్మిన 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో బోనస్ కింద రూ.514.36 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అదనంగా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం వరి రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాకు అదనంగా రూ.500 చొప్పున బోనస్ జమకానుంది.
News February 16, 2026
డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 10 సైంటిస్ట్ C పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. PhD(లైఫ్ సైన్స్/ బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్/అగ్రికల్చరల్/ వెటర్నరీ సైన్సెస్), MD అర్హత గల వారు మార్చి 14వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.67,700-రూ.2,08700 చెల్లిస్తారు. వెబ్సైట్: www.dbtindia.gov.in


