News September 15, 2024

రాజీనామాలతో ఒరిగేదేం లేదు: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ఒరిగేది లేదు. ఎన్నికలకు ముందు పవన్, చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి’ అని చెప్పారు.

Similar News

News February 14, 2026

కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసింది: KTR

image

TG: లోకల్ ఎన్నికల్లో కూడా డబ్బు ప్రభావం బాగా పెరిగిందని BRS నేత KTR పేర్కొన్నారు. కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసిందని ఆరోపించారు. ఆశించిన సీట్లు రాలేదని INCలో అసంతృప్తి ఉంది. BJPకి ఓట్లు, వార్డులు తక్కువ వచ్చినా అంతా బాగున్నట్లు చెప్పడం ఎందుకో అర్థం కావడం లేదు. మా పార్టీ గట్టిగా పోరాడింది. ఇప్పుడున్న 17 మున్సిపాల్టీలతో పాటు హంగ్ స్థానాల్లోనూ ఎక్కువ గెలుచుకుంటాం’ అని మీడియాతో చెప్పారు.

News February 14, 2026

పెట్టుబడి రాయితీ కింద రూ.310 కోట్లు: అచ్చెన్న

image

APలో భూసార పరీక్షలు నిర్వహించి 6 లక్షల మంది రైతులకు ఫలితాల పత్రాలు అందించామని బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి అచ్చెన్న తెలిపారు. ‘పొలం పిలుస్తోంది’తో 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందించామన్నారు. బడ్జెట్‌లో పెట్టుబడి రాయితీ కింద రూ.310 కోట్లు, యాంత్రీకరణలో 50% రాయితీ కోసం రూ.136 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 80% రాయితీతో రూ.90.4 కోట్లతో 1,130 డ్రోన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News February 14, 2026

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. నెలాఖరులో అకాల వర్షాలు!

image

TG: రాష్ట్రంలో శీతాకాలం దాదాపుగా ముగిసింది. ఎండలు, ఉక్కపోతలు మొదలయ్యాయి. కొన్ని రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు, నైట్ టెంపరేచర్లు 17-19 డిగ్రీలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. క్రమంగా ఉష్ణోగ్రతల్లో భారీ పెరుగుదల ఉంటుందంటున్నారు. అలాగే FEB 25-28 మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని పేర్కొంటున్నారు.
* మీ ఏరియాల్లో ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.