News September 15, 2024
రాజీనామాలతో ఒరిగేదేం లేదు: బొత్స

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వం తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ఒరిగేది లేదు. ఎన్నికలకు ముందు పవన్, చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి’ అని చెప్పారు.
Similar News
News February 14, 2026
కరీంనగర్ కాషాయానిదే.. మ్యాజిక్ ఫిగర్ దాటిన BJP

TG: కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఇద్దరు రెబల్, ఇండిపెండెంట్ అభ్యర్థులు తాజాగా కాషాయం కండువా కప్పుకున్నారు. ఇక్కడ మొత్తం 66 డివిజన్లు ఉండగా ఫలితాల్లో బీజేపీ 30 డివిజన్లు గెలుచుకుంది. నిన్న ఒక స్వతంత్ర, ఒక AIFB అభ్యర్థి ఆ పార్టీలో చేరారు. ఇవాళ మరో ఇద్దరి చేరిక, ఎంపీ బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటుతో కలిపి బీజేపీ బలం 35కు చేరింది. దీంతో మేయర్ పీఠం ఆ పార్టీ ఖాతాలో చేరనుంది.
News February 14, 2026
పాక్తో అభిషేక్ ఆడతారా? సూర్య లేటెస్ట్ స్టేట్మెంట్ ఇదే

T20 WCలో రేపు జరగబోయే IND-PAK మ్యాచులో అభిషేక్ శర్మ ఆడటంపై కెప్టెన్ సూర్యకుమార్ క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ఇరుజట్ల కెప్టెన్లు ప్రెస్మీట్లో మాట్లాడారు. తాము టఫ్ టీమ్తో ఆడతామని, అభిషేక్ తిరిగి IND జట్టులోకి రావాలని కోరుకుంటున్నామని PAK కెప్టెన్ సల్మాన్ అఘా అన్నారు. దీనిపై స్పందించిన సూర్య ‘నిజంగా సల్మాన్ అదే కోరుకుంటే తప్పకుండా అభిషేక్ను ఆడిస్తాం’ అని కౌంటర్ ఇచ్చారు. దీంతో అభి ఆడటం ఖాయమైంది.
News February 14, 2026
మున్సిపల్ ఫలితాలపై సీఎం కీలక సమావేశం

TG: మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చిస్తున్నారు. ఎక్స్ అఫీషియో ఓట్లపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఎల్లుండి మేయర్, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది.


