News September 15, 2024

రాజీనామాలతో ఒరిగేదేం లేదు: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ఒరిగేది లేదు. ఎన్నికలకు ముందు పవన్, చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి’ అని చెప్పారు.

Similar News

News February 5, 2026

సిస్టర్స్ సూసైడ్ కేసులో సంచలన విషయాలు

image

ఘజియాబాద్ సిస్టర్స్ <<19046962>>సూసైడ్<<>> కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. వాళ్లు కొన్నేళ్ల క్రితం మరియ, అలీజా, సిండీ అనే కొరియన్ పేర్లతో SM అకౌంట్స్ క్రియేట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. తండ్రికి విషయం తెలిసి వాటిని 10రోజుల క్రితం డిలీట్ చేశారు. వారి ఫోన్లు లాక్కున్నారు. రూ.2 కోట్ల అప్పుల్లో ఉన్న చేతన్ కుమార్ కరెంట్ బిల్లు కట్టేందుకు వారి ఫోన్లు అమ్మేశారు. వారికి పెళ్లి చేస్తానని కూడా బెదిరించారు.

News February 5, 2026

Money can’t buy happiness.. మస్క్ ట్వీట్ వైరల్

image

డబ్బుకు సంతోషానికి సంబంధం లేదనే విషయంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘డబ్బుతో సంతోషాన్ని కొనలేమని ఎవరైతే అన్నారో.. వారికి అసలు విషయం బాగా తెలుసు’ అంటూ ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. ₹లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయి ఉండి కూడా బాధపడుతున్న ఎమోజీని జత చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంపద పెరిగే కొద్దీ ప్రశాంతత కరవవుతుందా అనే చర్చకు ఈ ట్వీట్ తెరలేపింది.

News February 5, 2026

థియేటర్లలోకి ‘మీర్జాపూర్’.. రిలీజ్ ఎప్పుడంటే?

image

పాపులర్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ సినిమాగా SEP 4న థియేటర్లలోకి రానుంది. ‘మీర్జాపూర్ ది ఫిల్మ్’ పేరుతో రానున్న ఈ మూవీ సిరీస్‌లోని కొన్ని ముఖ్యమైన పాత్రలతో ఉంటుందని పేర్కొన్నారు. ఖాలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా త్రిపాఠి వంటి పాత్రలు ఉంటాయని తెలిపారు. ఈ కథను పునీత్ కృష్ణ రాయగా గుర్మీత్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రితేశ్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్నారు.