News September 15, 2024

రాజీనామాలతో ఒరిగేదేం లేదు: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ఒరిగేది లేదు. ఎన్నికలకు ముందు పవన్, చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి’ అని చెప్పారు.

Similar News

News January 28, 2026

ప్రముఖ డైరెక్టర్‌ శంకర్‌కు మాతృవియోగం

image

టాలీవుడ్ డైరెక్టర్ ఎన్.శంకర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి సక్కుబాయమ్మ వృద్ధాప్య సంబంధింత సమస్యలతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1997లో ‘ఎన్‌కౌంటర్‌’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన శంకర్.. శ్రీరాములయ్య, భద్రాచలం, జయం మనదేరా, ఆయుధం, జై బోలో తెలంగాణ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు. శంకర్ స్వగ్రామం నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చిరుమర్తి.

News January 28, 2026

MLAపై లైంగిక ఆరోపణలు.. విచారణకు జనసేన కమిటీ

image

AP: రైల్వే కోడూరు జనసేన MLA అరవ శ్రీధర్ తనను <<18975483>>లైంగికంగా<<>> వేధించారని సదరు మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై జనసేన కమిటీని ఏర్పాటు చేసింది. ‘శ్రీధర్‌పై వచ్చిన వార్తలపై విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించాం. వారంలో శ్రీధర్ కమిటీకి వివరణ ఇవ్వాలి. కమిటీ ఇచ్చే నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకునే వరకు ఆయనను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతున్నాం’ అని పేర్కొంది.

News January 28, 2026

ఆధార్ యాప్ వచ్చేసింది!

image

ఆధార్ సేవల్లో విప్లవాత్మక మార్పులు చేస్తూ UIDAI కొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇకపై ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఆధార్ <<18974342>>యాప్<<>> ద్వారానే మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెచ్చింది. ‘డిజిటల్ ఐడెంటిటీ’ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రయాణాల్లో ఫిజికల్ కాపీలు అవసరం లేకుండానే వెరిఫై చేసేలా మార్పులు చేసింది. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ పనులకు ఇది కీలకం కానుంది.