News September 15, 2024
రాజీనామాలతో ఒరిగేదేం లేదు: బొత్స

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వం తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ఒరిగేది లేదు. ఎన్నికలకు ముందు పవన్, చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి’ అని చెప్పారు.
Similar News
News February 20, 2026
సంతోషిమాత వ్రతం: పాటించాల్సిన నియమాలు

ఈ వ్రతంలో అత్యంత కఠినమైన నియమం పులుపు పదార్థాలకు దూరంగా ఉండటం. వ్రతం చేసే వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆ రోజున నిమ్మకాయ, చింతపండు, పెరుగు ముట్టుకోకూడదు. ఇంట్లో పులుపుతో వంటలు చేయకూడదు. వ్రతం రోజున అబద్ధాలు ఆడటం, ఇతరులను దూషించడం చేయరాదు. పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అమ్మవారి నామస్మరణ చేయాలి. నైవేద్యంగా పెట్టిన బెల్లం, శనగలను మాత్రమే ప్రసాదంగా తీసుకోవాలి.
News February 20, 2026
తానెంత గొప్ప బ్యాటరో అభిషేక్ గుర్తుచేసుకోవాలి: నాసర్ హుసేన్

భారత స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ మానసిక సమస్య వల్ల పరుగులు చేయలేకపోతున్నారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుసేన్ అభిప్రాయపడ్డారు. ‘<<19180377>>మూడు డకౌట్లు<<>> మానసికంగా ఇబ్బందిపెడతాయి. అభిషేక్ మంచి హిట్టర్. అతడు తన గత ప్రదర్శనలు గుర్తు చేసుకోవాలి. తన భారీ ఇన్నింగ్సుల వీడియోలను తెప్పించుకుని చూడాలి. తాను ఎంత గొప్ప బ్యాటర్ అనేది అభిషేక్ గుర్తు చేసుకోవాలి’ అని సూచించారు.
News February 20, 2026
పాత ఫోన్లలో అరుదైన ఖనిజాలు!

పాత ఫోన్లు, ల్యాప్టాప్లలో అరుదైన ఖనిజాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. యుద్ధ విమానాలు, క్షిపణులు, EVల్లో వాడే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉన్నాయని అంటున్నారు. ఇవి నియోడైమియం, సమారియం వంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్తో తయారైన శక్తిమంతమైన మ్యాగ్నెట్స్ అని పేర్కొంటున్నారు. వీటిని రిసైకిల్ చేస్తే ఇండియాకు తిరుగుండదని, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం విదేశాలపై ఆధారపడాల్సిన పని ఉండదని వెల్లడిస్తున్నారు.


