News July 13, 2024
ఆసరా పెన్షన్ తిరిగివ్వమని నోటీసులా?: కేటీఆర్

TG: దొంగ హామీలతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం వింత చేష్టలు మొదలుపెట్టిందని KTR విమర్శించారు. ఏవో కారణాలు చూపిస్తూ ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సొమ్మును వెనక్కి పంపమని నోటిసులు పంపిస్తోందని ట్వీట్ చేశారు. భద్రాద్రి(D)కి చెందిన మల్లమ్మ(80)కు ఆసరా పెన్షన్ కింద వచ్చిన 1.72 లక్షలు వెనక్కు కట్టాలని నోటీసు ఇవ్వడం అమానవీయమని మండిపడ్డారు. ఈ చర్యలు మానకుంటే రేవంత్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.
Similar News
News November 21, 2025
ఆ గొడ్డు మంచిదైతే ఆ ఊళ్లోనే అమ్ముడుపోను

కొంతమంది సొంతూరిలో తమకు సరైన అవకాశాలు లేవని చెప్పుకుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అయితే అతనిలో సత్తా ఉంటే సొంత ప్రాంతంలోనే పని లభించేదని ఈ సామెత అర్థం. అయితే ప్రతిభ అనేది ఒకరు ఆపితే ఆగేది కాదని చెప్పే పెద్దలు ఈ జాతీయాన్ని ఉదహరిస్తూ వేరొక చోట ప్రయత్నాలు చేసేవారిని గురించి విమర్శిస్తూ మాట్లాడేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు.
News November 21, 2025
దేవుడు ఎంత గొప్పవాడంటే ?

యత స్సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే|
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే||
సృష్టి ఆరంభంలో సమస్త ప్రాణులు దేని నుంచి ఉద్భవిస్తాయో, తిరిగి యుగం ముగిసే సమయంలో దేనిలో లయమైపోతాయో.. ఆ పరమ పవిత్ర పదార్థమే పరమాత్ముడు. ఆయన ఈ జగత్తును నడిపిస్తాడు. నిరంతరం జరిగే సృష్టి-లయ చక్రంలో ఆయనే ముఖ్యపాత్రుడు. అలాంటి భగవంతుడికి మన కోర్కెలు తీర్చడం పెద్ద విషయం కాదు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 21, 2025
సచివాలయ ఉద్యోగుల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. స్పౌజ్ కోటా ట్రాన్స్ఫర్ల ప్రక్రియను ప్రభుత్వం ఈనెల 30 లోగా పూర్తి చేయనుంది. <<18316925>>అర్హులైన<<>> వారు ఈనెల 24లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 25, 26 తేదీల్లో పరిశీలించి, సీనియారిటీ ప్రకారం జాబితాలు ప్రకటిస్తారు. 29వ తేదీకల్లా బదిలీల ఆర్డర్ జారీ చేయడంతోపాటు సచివాలయాల కేటాయింపు పూర్తి చేయనున్నారు.


