News August 25, 2024
225 విల్లాలకు నోటీసులు

TG: హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. జీవో 658కి విరుద్ధంగా 225 ROW హౌసులు నిర్మించారని, జీ+1కి పర్మిషన్ తీసుకుని జీ+2 కట్టారని పేర్కొన్నారు. 15 రోజుల్లోగా నోటీసులకు రిప్లై ఇవ్వాలని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్ణయాలతో చిత్రపురి సొసైటీకి రూ.50 కోట్ల నష్టం జరిగిందంటూ ఫిర్యాదు అందడంతో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.
Similar News
News March 24, 2026
ఖర్చులు తగ్గించే ఛాలెంజ్!

చిరుతిళ్లకో లేక ఆన్లైన్ ఆఫర్లనో చాలా మంది అనవసర ఖర్చు చేస్తారు. అలాంటి వారు ‘నో స్పెండ్ ఛాలెంజ్’ ఫాలో కావాలని నిపుణులు సూచిస్తున్నారు. నెలలో ఒక వారం రవాణా ఛార్జీలు, బిల్లు చెల్లింపులు వంటి ముఖ్యమైనవి తప్ప ఇతర ఖర్చులు పెట్టుకోకూడదని సూచిస్తున్నారు. అప్పుడే రోజూ ఎంత వృథా ఖర్చు చేస్తున్నామో తెలుస్తుందన్నారు. ఈ ఛాలెంజ్ పాటించే రోజులను క్రమంగా పెంచుకుంటే ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుందని అంటున్నారు.
News March 24, 2026
ఆముదం పంట విత్తడానికి అనువైన సమయం

ఆముదం పంటను ఖరీఫ్లో మే చివరి వారం నుంచి జులై 31 వరకు తొలకరి వర్షాలకు విత్తాలి. జులై తర్వాత ఆముదం పంటను ఏక పంటగా వేయాలి. మొక్కల మధ్య 90X60 సెం.మీ కనీస దూరం పాటించాలి. ఆగస్టు తర్వాత 60×45 సెం.మీ లేదా 60×30 సెం.మీ కనీస దూరంలో వేయవచ్చు. నీటి పారుదల ఉన్న ప్రాంతాల్లో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విత్తుకోవచ్చు. అక్టోబర్ తొలి వారంలో ఆముదం విత్తుకుంటే ఎక్కువ దిగుబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News March 24, 2026
ఎస్సీల మతమార్పిడిపై సుప్రీంకోర్టు తీర్పు.. నేపథ్యం ఇదే

AP: తనను కొందరు కులం పేరుతో దూషించడంతో పాటు దాడి చేశారని గుంటూరు జిల్లాకు చెందిన పాస్టర్ ఆనంద్ 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆరుగురిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయగా, FIR కొట్టేయాలంటూ వారు <<19462779>>హైకోర్టుకు<<>> వెళ్లారు. ఆనంద్ పదేళ్లుగా పాస్టర్గా పని చేస్తున్నారని కోర్టు గుర్తించింది. కుల ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ, మతమార్పిడి తర్వాత ఆ రక్షణ పొందేందుకు అర్హత ఉండదని కోర్టు స్పష్టం చేసింది.


