News August 30, 2024
వారికేమో నోటీసులు.. వీరికేమో కూల్చివేతలు!

TG: తెలంగాణలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే ఎంత పెద్దవారైనా చర్యలు తప్పవని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కొందరు ప్రముఖుల భవనాలను కూల్చివేయించింది కూడా. అయితే ప్రముఖులకు నోటీసులతో సరిపెట్టి, పేదలకు మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా ఇళ్లు కూలుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News January 9, 2026
DGPకి హైకోర్టులో ఊరట

TG: DGP శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో DGP పూర్తిస్థాయి నియామకం జరగాలని UPSC సహా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
News January 9, 2026
టికెట్ రేట్ల పెంపు.. ఇరు వైపుల నుంచి విమర్శలు

‘Rajasaab’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించడంపై విమర్శలు వస్తున్నాయి. అఖండ2కు హైక్పై హైకోర్టు చీవాట్లతో ఇకపై టికెట్ రేట్లు పెంచబోమని సినిమాటోగ్రఫీ మంత్రి వెంకట్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఎన్నిసార్లు ప్రకటించి పక్కనబెడతారు అని ప్రజలు, విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అటు ఇవాళ రిలీజ్ ఉంటే 8న అర్ధరాత్రి తర్వాత పర్మిషన్ వస్తే ఏం లాభమని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. మీ Comment?
News January 9, 2026
వీరు సూర్యుడిని పూజిస్తే విశేష ఫలితాలు

జాతకంలో వివాహ పరిబంధన దోషం, పుత్ర దోషం, పుత్ర పరిబంధన దోషం, విద్యా, ఉద్యోగ పరిబంధన దోషాలతో పాటు సూర్య దోషం ఉన్నవారు ఆదివారం నాడు సూర్య భగవానుడిని ఆరాధించాలి. ప్రతి ఆదివారం సూర్యోదయం వేళ అర్ఘ్యం సమర్పించి, ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఈ దోషాల తీవ్రత తగ్గుతుంది. క్రమం తప్పకుండా సూర్యారాధన చేస్తే జీవితంలో ఆటంకాలు తొలగి, విద్య, ఉద్యోగ, వివాహ రంగాల్లో శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.


