News January 27, 2025

ఫిబ్రవరి 9 నుంచి బస్సులు బంద్ అంటూ నోటీసులు

image

TG: హైదరాబాద్ RTC X రోడ్డులోని బస్‌భవన్‌లో RTC యాజమాన్యానికి కార్మిక సంఘాల JAC సమ్మె నోటీస్ ఇచ్చింది. తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రభుత్వంలో విలీనం, 2PRCలు, CCS, పీఎఫ్ డబ్బులు రూ.2700 కోట్ల చెల్లింపులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. డిమాండ్లు నెరవేర్చకుంటే ఫిబ్రవరి 9 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ ఆర్టీసీ యాజమాన్యానికి ఇచ్చిన నోటీసుల్లో స్పష్టం చేసింది.

Similar News

News December 31, 2025

నేటి నుంచి కొత్త జిల్లాల్లో పాలన

image

AP: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లలో నేటి నుంచే పాలనా వ్యవహారాలు ప్రారంభం కానున్నాయి. కొత్త కలెక్టర్లు, జేసీలను నియమించే వరకు ఉమ్మడి జిల్లాల అధికారులే ఇన్‌ఛార్జులుగా కొనసాగుతారని ప్రభుత్వం వెల్లడించింది. కాగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిన్న ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాల సంఖ్య 28కి పెరిగింది.

News December 31, 2025

అయామ్ సెమనీ కోడి మరికొన్ని ప్రత్యేకతలు

image

అయామ్ సెమనీ కోడిని దాని ధరను బట్టి “చికెన్ లంబోర్ఘిని” అని కూడా అంటారు. “అయామ్” అంటే ఇండోనేషియాలో “కోడి”, “సెమనీ” అంటే “పూర్తిగా నలుపు” అని అర్థం. పూర్వకాలంలో ఎక్కువగా ఇండోనేషియాలో రాజకుటుంబాలు వీటిని పెంచేవారు. కోడి పందేలకు ఉపయోగించేవారు. ఎందుకంటే ఈ కోళ్ల కండరాలు బలంగా ఉంటాయి, అలాగే ఇవి చాలా వేగంగా కదులుతాయి. ఇవి చూడటానికి కడక్‌నాథ్ కోళ్లలా ఉన్నా.. అయామ్ సెమనీ కోళ్లు చాలా ప్రత్యేకమైనవి.

News December 31, 2025

త్వరలో 14వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: DGP

image

TG: పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు డీజీపీ శివధర్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో 14వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని నిన్న ప్రెస్ మీట్‌లో ప్రకటించారు. ప్రభుత్వానికి ఖాళీల ప్రతిపాదనలు పంపామని, త్వరలో అనుమతి రానుందని చెప్పారు. కాగా రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 3 సార్లు (2016, 2018, 2022) మాత్రమే నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి వస్తోంది.