News May 21, 2024
అత్యధిక సిజేరియన్లు చేసిన ఆస్పత్రులకు నోటీసులు

AP: గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలో 362 మాతృమరణాలు చోటుచేసుకోగా, ఇందులో 189 మంది సిజేరియన్ చేయించుకున్నవారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఆరోగ్యశ్రీ గుర్తింపు ఉన్న కొన్ని ఆస్పత్రుల్లో 90 శాతంపైగా సీసెక్షన్లే ఉంటున్నాయి. దీంతో అలాంటి 125 ఆస్పత్రులకు రాష్ట్ర వైద్య శాఖ నోటీసులు పంపింది. ఎక్కువ సిజేరియన్లు చేయడానికి గల కారణాలు తెలపాలని ఆదేశించింది.
Similar News
News November 24, 2025
AP TET.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2.59 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇన్ సర్వీస్ టీచర్లు 32,000 మంది దరఖాస్తు చేశారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. డిసెంబర్ 10 నుంచి ఆన్లైన్లో రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
News November 24, 2025
తిరుమల కొండపై ‘బంగారు బావి’ వైభవం

శ్రీవారి దర్శనం తర్వాత కనిపించేదే ‘బంగారు బావి’. దీనికి బంగారు రేకుల తాపడం ఉంటుంది. అందుకే ఈ పేరొచ్చింది. ఇందులో నుంచి వచ్చే జలాన్ని స్వామి కైంకర్యాలకు ఉపయోగిస్తారు. ఈ బావి అడుగున వైకుంఠంలో ప్రవహించే విరజానది ప్రవహిస్తుందని నమ్ముతారు. పూర్వజన్మలో తొండమాన్ చక్రవర్తిగా ఉన్న రంగదాసు ఈ పవిత్ర బావిని నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ జలం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 24, 2025
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోండిలా

బ్యాంకు ఖాతాల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను RBI ఉద్గం <


