News October 1, 2024
జోగి రమేశ్కు నోటీసులు.. నందిగం బెయిల్పై వాదనలు పూర్తి

AP: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్కు మంగళగిరి పోలీసులు నోటీసులిచ్చారు. రేపు ఉదయం డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటు టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును 4వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
Similar News
News December 17, 2025
నవంబర్లో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులు!

యాపిల్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. NOVలో $2 బిలియన్ల విలువైన ఐఫోన్లను భారత్ ఎగుమతి చేసినట్లు బిజినెస్ వర్గాలు తెలిపాయి. దేశంలో మొత్తం స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో ఇది 75శాతమని, FY26లో 8 నెలల్లోనే ఎగుమతులు $14 బిలియన్ దాటినట్లు పేర్కొన్నాయి. ఐఫోన్ తయారీ కేంద్రాలు పెరగడం దీనికి కారణమని భావిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఎగుమతులు FY25లో ఏప్రిల్-నవంబర్తో పోలిస్తే ఈ FYలో 43% వృద్ధి సాధించాయని పేర్కొన్నాయి.
News December 17, 2025
ఉప ఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడం లేదు: KTR

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో <<18592868>>స్పీకర్ నిర్ణయం<<>> ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. న్యాయస్థానాలపై, రాజ్యాంగంపై రాహుల్ గాంధీకి, కాంగ్రెస్కు ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందన్నారు. కేవలం ఫోటోలకు పోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని ఎద్దేవా చేశారు. <<18593829>>ఉపఎన్నికలు<<>> వస్తే ఓడిపోతామని కాంగ్రెస్ భయపడుతోందన్నారు.
News December 17, 2025
ప్రజల ప్రాణాలతో CBN చెలగాటం: సజ్జల

AP: ప్రజల ప్రాణాలతో CM చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని వైసీపీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో కోటి సంతకాల ప్రతులను పరిశీలించారు. పీపీపీ వెనుక పెద్ద స్కామ్ ఉందన్నారు. ప్రైవేటులో ఫ్రీగా వైద్యం ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారన్నారు. ప్రభుత్వం చేసిన అప్పుల్లో కొంత ఖర్చు చేసినా కాలేజీలు పూర్తవుతాయన్నారు.


