News October 1, 2024
జోగి రమేశ్కు నోటీసులు.. నందిగం బెయిల్పై వాదనలు పూర్తి

AP: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్కు మంగళగిరి పోలీసులు నోటీసులిచ్చారు. రేపు ఉదయం డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటు టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును 4వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
Similar News
News December 23, 2025
సంక్రాంతి బరిలో ముందుకొచ్చిన మూవీ!

ఈ సంక్రాంతికి థియేటర్ల వద్ద సందడి చేయడానికి సినిమాలు క్యూ కట్టాయి. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, శ్రీలీల నటించిన ‘పరాశక్తి’ సైతం అదృష్టం పరీక్షించుకోనుంది. అయితే రిలీజ్ డేట్పై మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. తొలుత JAN 14 అని చెప్పి తాజాగా JAN 10నే వస్తున్నట్లు ప్రకటించారు. రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి తదితర తెలుగు చిత్రాల మధ్య ఈ మూవీకి థియేటర్లు దొరుకుతాయో లేదో చూడాలి.
News December 23, 2025
మహిళా క్రికెటర్ల ఫీజులు భారీగా పెంపు

భారత మహిళా క్రికెటర్ల ఫీజులను BCCI భారీగా పెంచింది. ఇకపై వన్డేలతో పాటు మల్టీ డే మ్యాచులకు ఓ రోజుకు(ప్లేయింగ్ 11) రూ.50 వేలు చెల్లించనున్నారు. స్క్వాడ్లోని సభ్యులకు రూ.25 వేలు, రిజర్వ్ ప్లేయర్లకు రూ.12,500 అందించనున్నారు. అదే T20 అయితే రూ.25వేలు చెల్లించనున్నారు. రిజర్వ్లో ఉన్నవారికి రూ.12,500 దక్కనుంది. ప్రస్తుతం వీరికి ప్లేయింగ్ 11లో రూ.20 వేలు, బెంచ్ మీద ఉంటే రూ.10వేలు చెల్లిస్తున్నారు.
News December 23, 2025
డిసెంబర్ 23: చరిత్రలో ఈ రోజు

☛ 1902: భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ జననం
☛ 1940: ప్రముఖ నవలా రచయిత ముదిగొండ శివప్రసాద్ జననం
☛ 1997: పండితుడు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి మరణం
☛ 2004: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణం(ఫొటోలో)
☛ 2014: ప్రముఖ దర్శకుడు బాలచందర్ మరణం
☛ 2022: ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మరణం
– జాతీయ రైతు దినోత్సవం


