News August 21, 2024
జోగి రమేశ్కు మరోసారి నోటీసులు

AP: చంద్రబాబు ఇంటిపై గతంలో జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్కు మంగళగిరి రూరల్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దాడి సమయంలో ఉపయోగించిన ఫోన్, సిమ్ అందజేయాలని కోరారు. కాగా నిన్న పోలీసుల విచారణకు జోగి రమేశ్ గైర్హాజరయ్యారు. ఆయన తరఫున న్యాయవాదులు మంగళగిరి పోలీస్ స్టేషన్కు వచ్చారు.
Similar News
News February 4, 2026
గర్భిణులు రోజుకెంత ఉప్పు తీసుకోవాలంటే..

ప్రెగ్నెన్సీలో మహిళలు రోజుకి 3.8 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో 5.8గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఎక్కువగా తీసుకుంటే కాళ్లు, చేతుల వాపులు, తరచుగా మూత్రవిసర్జన, హైబీపీ సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్లు చెబుతున్నారు. మరీ తక్కువ ఉప్పు తీసుకుంటే బలహీనత, అలసట, నీరసం వంటివన్నీ వస్తాయి. కాబట్టి సరైన మోతాదులో మాత్రమే ఉప్పు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News February 4, 2026
నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ (<
News February 4, 2026
OTTలోకి వచ్చేసిన హిట్ మూవీ

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా.. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్లను సాధించింది. ప్రస్తుతం ఇది ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.


