News April 7, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో MLCకి నోటీసులు?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ ఎమ్మెల్సీకి త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాప్ చేసే పరికరాలకు సదరు ఎమ్మెల్సీ నిధులు సమకూర్చారని పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. ఆయనను విచారిస్తే మరికొందరి నేతల పేర్లు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారట. ఇప్పటివరకు పోలీసుల చుట్టే తిరిగిన ఈ కేసు ఇకపై రాజకీయ నేతల చుట్టూ తిరగనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 17, 2025

NGKL: ప్రజావాణికి 48 ఫిర్యాదులు

image

నాగర్‌కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 48 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రకటించారు. అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు అందరూ తమ పరిధిలో వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 17, 2025

సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు ₹5 లక్షల పరిహారం

image

TG: సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున పరిహారం అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. మంత్రి అజహరుద్దీన్, MIM MLA, మైనారిటీ విభాగం అధికారితో కూడిన ప్రతినిధుల బృందాన్ని ప్రభుత్వం సౌదీకి పంపించనుంది. మృతుల భౌతిక కాయాలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు జరిపించనుంది. బాధిత కుటుంబాల నుంచి ఇద్దరు చొప్పున తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను CM ఆదేశించారు.

News November 17, 2025

పండ్ల తోటల్లో పశుగ్రాసం సాగుతో లాభాలు

image

డెయిరీ ఫామ్ నడుపుతూ పండ్ల తోటలను పెంచుతుంటే వాటిలో పశుగ్రాసం సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి తోటల్లో.. లూసర్న్, బెర్సీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్ జాతి గ్రాసాలను పెంచుకోవచ్చు. దీని వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, పండ్ల తోటలకు రసాయన ఎరువులను వాడకం తగ్గుతుంది. ఈ పైరుల సాగును ప్రతీ 3-4 ఏళ్లకు ఒకసారి మార్చాలి.