News March 24, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి నోటీసులు

image

TG: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌తో పాటు ఓ ఛానల్ ఎండీకి నోటీసులు ఇచ్చారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు అయిన తర్వాత వీరు విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

Similar News

News October 3, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 3, 2024

అక్టోబర్ 3: చరిత్రలో ఈరోజు

image

1903: స్వాతంత్ర్య సమరయోధుడు స్వామి రామానంద తీర్థ జననం
1923: బ్రిటిష్ ఇండియా తొలి మహిళా పట్టభద్రురాలు, తొలి మహిళా వైద్యురాలు కాదంబినీ గంగూలీ మరణం
1954: నటుడు సత్యరాజ్ జననం
1978: భారత్‌లో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గా అగర్వాల్ జననం
2006: సినీ నటి ఇ.వి.సరోజ మరణం

News October 3, 2024

ఇజ్రాయెల్ ప్రతిఘటిస్తే మా జవాబు గట్టిగా ఉంటుంది: ఇరాన్

image

ఇజ్రాయెల్‌పై వందలాది క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ తాజాగా ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేసింది. తాము యుద్ధం కోరుకోమని, ఇజ్రాయెల్ ప్రతిఘటిస్తే మాత్రం జవాబు గట్టిగా ఉంటుందని దేశాధ్యక్షుడు పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. ‘ఇజ్రాయెల్ కారణంగానే మేం స్పందించాల్సి వస్తోంది. పశ్చిమాసియాలో అస్థిరత పెంచాలనేది ఆ దేశపు కుట్ర. ఈ రక్తపాతాన్ని ఆపాలని అమెరికా, ఐరోపా దేశాలు టెల్ అవీవ్‌కు చెప్పాలి’ అని స్పష్టం చేశారు.