News August 22, 2025

నేడు 1,623 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

image

TG: వైద్యారోగ్య శాఖలో 1,623 స్పెషలిస్టు డాక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. నిన్న మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర చరిత్రలో వైద్యుల భర్తీ ప్రక్రియలో ఇదే అతి పెద్ద నోటిఫికేషన్‌గా మారనుంది. ఇటీవల వైద్యారోగ్య శాఖలో 8 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News April 5, 2026

ధురంధర్-2ను వీక్షించిన పాక్ మాజీ ప్రధాని?

image

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ధురంధర్-2 సినిమా కాపీని తెప్పించుకొని వీక్షించినట్లు ఆ దేశానికి చెందిన జర్నలిస్టు ఖలీద్ వెల్లడించారు. అందులో తన పాత్రను తీర్చిదిద్దిన విధానాన్ని ఆయన మెచ్చుకున్నట్లు తెలిపారు. పాక్‌లో ఈ చిత్రంపై నిషేధం విధించినప్పటికీ తాను తొలి రోజే చూసినట్లు ఖలీద్ గతంలో చెప్పారు. కాగా ధురందర్-2లో నవాజ్ పాత్రను మషూర్ అమ్రోహి పోషించారు. క్యాస్టింగ్ పర్‌ఫెక్ట్‌గా సెట్టవడం విశేషం.

News April 5, 2026

భారీగా తగ్గిన ధరలు.. రూ.100కే 8 కేజీలు

image

ఉల్లి ధరలు భారీగా పడిపోతున్నాయి. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల రూ.100కే 8 కేజీల ఉల్లి అమ్ముతున్నారు. అటు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నెల కిందటి వరకు క్వింటా రూ.2వేలు ఉండగా ఇప్పుడు రూ.800 నుంచి రూ.1,400 మాత్రమే పలుకుతోంది. మరి మీ ఏరియాలో ఉల్లి రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.

News April 5, 2026

ట్రంప్ పర్మిషన్ లేకపోతే ఆయిల్ కూడా కొనలేరు: రాహుల్

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్మిషన్ లేకుండా ఇండియా కనీసం చమురు కూడా కొనలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘మోదీ కెరీర్ ఎప్పుడైనా ముగించేస్తానని ట్రంప్ ఓపెన్‌గానే అన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మోదీకి సంబంధించిన నిజాలున్నాయి. దీంతో ఇండియా ఇంధన భద్రత, డేటాను ట్రంప్ చేతుల్లో ఆయన పెట్టారు. రాజీపడటం వల్లే ఇదంతా జరిగింది’ అని అస్సాంలోని గోలాఘాట్‌లో అన్నారు.