News January 28, 2025

250 DEE పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్

image

AP: రాష్ట్రంలో 250 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల(DEE) పోస్టుల భర్తీకి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ ఖాళీలపై APPSCకి జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపనుంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం. ఇటీవల ఈ శాఖలో 266 మంది ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. త్వరలోనే మరికొందరికి ప్రమోషన్లు ఇవ్వడంపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ దృష్టిసారించారు.

Similar News

News November 26, 2025

ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సరెండర్: కలెక్టర్

image

విధుల నిర్వ‌హ‌ణ‌లో అలసత్వం వద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను హెచ్చరించారు. విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా(RWS) సూప‌రింటెండెంట్ ఇంజ‌నీర్ ఎస్‌.విద్యాసాగ‌ర్‌ను ప్ర‌భుత్వానికి స‌రెండ‌ర్ చేశామన్నారు. జిల్లా పంచాయ‌తీరాజ్ ఎస్ఈకి.. ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఇన్‌ఛార్జ్ ఎస్ఈగా బాధ్యత‌లు అప్పగించామని కలెక్టర్ మంగళవారం అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

News November 26, 2025

ఏర్పేడు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) తిరుపతిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్- 02 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. ఏదేని డిగ్రీ న్యాచురల్ సైన్స్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/jobs/advt_702025/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 08.

News November 26, 2025

రేపటి నుంచే శుక్ర మౌఢ్యమి.. ఈ శుభకార్యాలు చేయొద్దు!

image

రేపటి నుంచి ఫిబ్రవరి 17వరకు శుక్ర మౌఢ్యమి ఉందని పండితులు తెలిపారు. ‘శుభాలకు అధిపతులైన గురు, శుక్రుడు ఈ మూఢాల్లో సూర్యుడికి సమీపంగా రావడంతో శక్తిని కోల్పోతారు. మొత్తం 84రోజులు ఈ శుక్ర మౌఢ్యమి కొనసాగనుంది. ఈ రోజుల్లో పెళ్లి, యాత్రలు, పుట్టు వెంట్రుకలు తీయడం, గృహప్రవేశాలు, వాహనాల కొనుగోళ్లు, బోర్లు తవ్వించడం వంటివి చేయొద్దు. నిత్యారాధన, సీమంతాలకు ఈ దోషం వర్తించదు’ అని పండితులు చెబుతున్నారు.