News January 28, 2025

250 DEE పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్

image

AP: రాష్ట్రంలో 250 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల(DEE) పోస్టుల భర్తీకి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ ఖాళీలపై APPSCకి జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపనుంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం. ఇటీవల ఈ శాఖలో 266 మంది ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. త్వరలోనే మరికొందరికి ప్రమోషన్లు ఇవ్వడంపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ దృష్టిసారించారు.

Similar News

News November 24, 2025

కొడంగల్ వేదికగా స్థానిక ప్రచారం మొదలెట్టిన సీఎం

image

TG: 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రచారాన్ని తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి ప్రారంభించారు. ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, మహిళలు ఆ చీరలు కట్టుకొని అభివృద్ధికి అండగా నిలిచే వారికి ఓటేయాలన్నారు. పదేళ్లు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కాగా త్వరలోనే 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు SEC షెడ్యూల్ విడుదల చేయనుంది.

News November 24, 2025

అధిక ధరలకు అమ్మితే కాల్ చేయండి!

image

బస్‌స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, సూపర్ మార్కెట్స్ వంటి చోట్ల కొందరు MRP కంటే అధిక ధరలకు వస్తువులు అమ్ముతుంటారు. అలాంటి సమయంలో ప్రశ్నించడం వినియోగదారుడిగా నీకున్న హక్కు. ఒకవేళ ఎవరైనా అధిక ధర వసూలు చేస్తే అది చట్ట ప్రకారం నేరం. ఇలాంటి మోసాలను వెంటనే నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ నం.1915కు కాల్ లేదా WhatsApp No 8800001915కు మెసేజ్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. SHARE IT

News November 24, 2025

CBN కోసం పవన్ డైవర్షన్ పాలిటిక్స్: అంబటి

image

AP: తిరుమల <<18376126>>లడ్డూ వివాదం<<>>పై Dy.CM పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌కు మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ‘ప్రజాగ్రహం నుంచి చంద్రబాబును కాపాడేందుకు పవన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర, నష్టపరిహారం కోసం పోరాడాల్సిందిపోయి.. పొలిటికల్ డ్రామాలోకి తిరుమలను, లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చారు. తప్పుడు ప్రచారం, ప్రజలను నమ్మించడంలో CBN, పవన్ నిపుణులు. గోబెల్స్‌ను మించిపోయారు’ అని ఫైరయ్యారు.