News September 12, 2025

350 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

పుణేలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వివిధ కేటగిరీల్లో 350 స్పెషలిస్టు ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఈ నెల 30లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.1,180(SC / ST / PwBDలకు రూ.118). పోస్టును బట్టి బీటెక్, బీఈ, డిగ్రీ, లా డిగ్రీ, ఉగ్యోగానుభవం ఉండాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల కోసం <>https://bankofmaharashtra.in/<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

Similar News

News September 12, 2025

రాజధానిలో ఎవరైనా ఇండస్ట్రీలు కడతారా: సజ్జల

image

రాజధానిలో ఎవరైనా ఇండస్ట్రీలు కడతారా అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి కోసం చేసిన రూ.లక్షల కోట్ల అప్పు ఎలా తీరుస్తారని ఆయన ప్రశ్నించారు. ‘కేంద్రం నుంచి ఎంత డబ్బు తీసుకువచ్చి అయినా రాజధాని కడితే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ రూ.లక్ష కోట్లు ఇప్పటికే రాజధాని పేరుతో వృథా చేశారు. వైజాగ్, కర్నూలు, విజయవాడలో కూడా రాజధాని పెట్టొచ్చు’ అని సజ్జల వ్యాఖ్యానించారు.

News September 12, 2025

మా హయాంలో పరిశ్రమలు వెళ్లిపోలేదు: సజ్జల

image

తమ హయాంలో ఎలాంటి పరిశ్రమలు వెళ్లిపోలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇదంతా ఇతర పార్టీలు చేసిన అసత్య ప్రచారంగా Way2News కాన్‌క్లేవ్‌లో కొట్టిపారేశారు. లులూ వెళ్లిపోయిందన్న ఆరోపణలు వినిపించాయని చెప్పడంతో అదేమైనా ఉపాధి కల్పించే ఇండస్ట్రీయా అని ప్రశ్నించారు. కొవిడ్ రాకపోయుంటే తాము మరింత మెరుగ్గా పనిచేసేవాళ్లమని, మరింత ఆర్థిక వృద్ధి సాధించేవాళ్లమని చెప్పారు.

News September 12, 2025

స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు ఏమైనా చేస్తాం: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు తాము దేనికైనా సిద్ధమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తిగా నిలిచిపోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారు. 32 విభాగాలను ఔట్‌సోర్సింగ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రంలో అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఉద్ధరిస్తున్నట్లు చూపుతున్నారు’ అని బొత్స మండిపడ్డారు.