News September 5, 2024
కన్వీనర్ కోటాలో 3,879 MBBS సీట్లకు నోటిఫికేషన్

AP: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న 3,879 ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు ఎన్టీఆర్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వెబ్సైట్: <
Similar News
News November 17, 2025
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం.. నేడు ఏం జరగనుంది?

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. స్పీకర్పై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్తో పాటు 10 మంది MLAలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ను ధర్మాసనం నేడు విచారించనుంది. MLAలను విచారించేందుకు స్పీకర్కు మరింత సమయం ఇస్తారా? లేదా తుది నిర్ణయం తీసుకుంటారా? ఈ నెల 23న సీజేఐ గవాయ్ రిటైర్ కానున్న నేపథ్యంలో విచారణను మరో బెంచ్కు పంపిస్తారా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.
News November 17, 2025
గంభీర్ వల్లే ఓడిపోయాం.. నెటిజన్ల ఫైర్

నిన్న సౌతాఫ్రికా చేతిలో టీమ్ ఇండియా ఓటమికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తప్పులే కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో పదేపదే ఎందుకు మార్పులు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. స్పెషలిస్టు బ్యాటర్ సాయి సుదర్శన్ను ఆడించకుండా నలుగురు స్పిన్నర్లు ఎందుకని నిలదీస్తున్నారు. గతేడాది NZతో వైట్వాష్ అయినా పాఠాలు నేర్వకుండా మళ్లీ స్పిన్ పిచ్లే ఎందుకు తయారుచేశారని ప్రశ్నిస్తున్నారు.
News November 17, 2025
ఒకేసారి రెండు సీక్వెల్స్లో తేజా సజ్జ!

హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన తేజా సజ్జ మరో 2 చిత్రాలను లైన్లో పెట్టారు. జాంబిరెడ్డి, మిరాయ్ మూవీల సీక్వెల్స్ను సమాంతరంగా పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు సమాచారం. జనవరిలో జాంబిరెడ్డి-2, మార్చిలో మిరాయ్-2ను సెట్స్పైకి తీసుకెళ్తారని టాక్. ఈ సినిమాలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది.


