News April 16, 2025

రాష్ట్రంలో రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్

image

AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు.

Similar News

News December 16, 2025

బాలికల స్కూల్ డ్రాపౌట్స్‌.. UPలో ఎక్కువ, TGలో తక్కువ!

image

దేశంలో బాలికల స్కూల్ డ్రాపౌట్స్ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం UP(57%) అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. అత్యల్పంగా తెలంగాణలో 31.1% డ్రాపౌట్స్ అయినట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా గత నాలుగేళ్లలో 84.9 లక్షల మంది చదువును మధ్యలోనే ఆపేశారని, అందులో సగం కంటే ఎక్కువ బాలికలే ఉన్నారని పేర్కొంది. ఐదేళ్లలో 26.46 లక్షల మందిని తిరిగి స్కూళ్లలో చేర్పించినట్లు ప్రకటించింది.

News December 16, 2025

2,757 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో 2,757 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BA, B.COM, BSc, డిప్లొమా, టెన్త్, ITI, ఇంటర్ అర్హతగల వారు NAPS/NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 16, 2025

మాజీ ఎంపీ రామ్ విలాస్ కన్నుమూత

image

రామ జన్మభూమి ఉద్యమ నేత, బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి(67) కన్నుమూశారు. కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రేవా(మధ్యప్రదేశ్)లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో నిన్న చనిపోయారు. వేదాంతి అంత్యక్రియలు ఇవాళ అయోధ్యలో జరగనున్నాయి. ఆయన తన జీవితాన్ని అయోధ్య ఆలయ నిర్మాణం కోసమే అర్పించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2సార్లు MPగా గెలిచారు.