News October 9, 2025
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్

TG: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. మొదటి విడతలో 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. నేటి నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. రోజూ ఉ.10.30 నుంచి సా.5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 13న రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.
Similar News
News February 20, 2026
ఇది వరి లాంటి కలుపు మొక్క

వరి చేనులో ‘బొంత ఊద’ కలుపు మొక్కలు కలవరపెడుతున్నాయి. ఇవి కూడా వరి మాదిరిగానే పెరుగుతాయి. పూర్తిగా పెరిగే వరకు వీటిని గుర్తుపట్టలేము. అందుకే దీన్ని దొంగ వరి అంటారు. పంటకు అందించే పోషకాలను ఇవి గ్రహించి వరి కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఈ కలుపు మొక్కల వల్ల వరిలో పొడ తెగులు, సుడిదోమ ఉద్ధృతి పెరుగుతుందని రైతులు అంటున్నారు. వరిలో ఇలాంటి కలుపును గుర్తిస్తే నిపుణుల సూచనల మేరకు మందులు వాడి నిర్మూలించండి.
News February 20, 2026
బెంగళూరు- BZA మధ్య వందేభారత్ వేయండి.. స్పందించిన లోకేశ్

బెంగళూరులో ఉంటున్న కోస్తాంధ్ర టెకీల రైలు కష్టాలపై ఏపీ మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. బెంగళూరు నుంచి విజయవాడకు వందేభారత్ రైలు కావాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ అంశాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తామని లోకేశ్ భరోసానిచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలని MP కేశినేని చిన్నిని కోరారు. ‘వందేభారత్ స్లీపర్’ రైలు తీసుకొచ్చేలా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో చర్చలు జరుపుతున్నట్లు MP తెలిపారు.
News February 20, 2026
RITES లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


