News January 13, 2025
పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

TG: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 5 వరకు ఫైన్తో అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.ouadmissions.com, www.osmania.ac.in వెబ్సైట్లు సంప్రదించండి.
Similar News
News February 7, 2026
మంత్రాలు చదవాలా, ఉచ్ఛరించాలా?

బుద్ధిని పెంచుకోవడానికి ‘గ్రంథాలు’ చదవాలి. ఏకాగ్రత, ఇంట్లో పాజిటివ్ వైబ్స్ నింపడానికి స్తోత్రాలు ‘పఠించాలి’. అనుకున్న ఫలితం సిద్ధించాలంటే అక్షర దోషం లేకుండా మంత్రాన్ని ‘ఉచ్ఛరించాలి’. దేవునితో అనుబంధాన్ని, శరణాగతిని పొందాలంటే ఆయన గుణాలను ‘స్తుతించాలి’. ఎలాంటి ఆడంబరాలు లేకుండా ప్రేమతోనే ఆయన నామాన్ని ‘పలకాలి’. తద్వారా దైవ సాన్నిధ్యాన్ని సులభంగా పొందవచ్చు. ఇవన్నీ కలిస్తేనే పరిపూర్ణమైన భక్తి సాధ్యం.
News February 7, 2026
AI కోసం టెక్ దిగ్గజాల ₹58 లక్షల కోట్ల రిస్క్!

AI రేసులో గెలవడానికి గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ కంపెనీలు 2026లో ఏకంగా $700 బిలియన్లు (సుమారు ₹58 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 60% ఎక్కువ. డేటా సెంటర్లు, చిప్స్ కోసం చేస్తున్న ఈ భారీ పెట్టుబడులు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విపరీతమైన ఖర్చుల వల్ల అమెజాన్, మైక్రోసాఫ్ట్ షేర్లు పడిపోగా.. కంపెనీల ఫ్రీ క్యాష్ ఫ్లో తగ్గి అప్పులు పెరుగుతున్నాయి.
News February 7, 2026
APRకి అమరావతిలో క్వాంటం కంప్యూటర్లు: చంద్రబాబు

AP: ఈ నెల 16న అమరావతికి బిల్ గేట్స్ రానున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘APR 14 నుంచి 2 క్వాంటం కంప్యూటర్లు అమరావతిలో ఆపరేట్ అవుతాయి. అమరావతిలో క్వాంటం టాలెంట్ హబ్ రెడీ అవుతోంది. దాని ద్వారా ఐదేళ్లలో 35లక్షల మంది విద్యార్థులు ట్రైన్ అవుతారు. తిరుపతిని స్పేస్ సిటీగా మార్చేందుకు సహకరించాలని ఇప్పుడే కేంద్రాన్ని కోరాను. వచ్చే 40ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేపట్టాం’ అని తెలిపారు.


