News January 13, 2025

పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

TG: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 5 వరకు ఫైన్‌తో అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.ouadmissions.com, www.osmania.ac.in వెబ్‌సైట్‌లు సంప్రదించండి.

Similar News

News February 10, 2026

కోసిన మిరప పంటను ఇలా ఎండబెడితే మేలు

image

పంట నుంచి కోసిన మిరపకాయలను కుప్పగా పోసి టార్పాలిన్‌తో ఒక రోజంతా కప్పి ఉంచాలి. ఇలా చేస్తే కాయలు అన్నీ ఒకేలా పండుతాయి. తర్వాత కాయలను పాలిథీన్ పట్టాలపై లేదా శుభ్రం చేసిన కాంక్రీటు కల్లాల మీద ఆరబెట్టాలి. ఇసుక లేదా పేడ అలికిన కల్లాలపై ఆరబెట్టకూడదు. రాత్రిపూట కాయలను పట్టాలతో కప్పి ఉదయం ఎండరాగానే పట్టా తీసేయాలి. మిరపలో తేమ 10-11% వరకు వచ్చేలా ఎండబెట్టాలి. లేకపోతే రంగును, మెరుపును కోల్పోయే అవకాశం ఉంది.

News February 10, 2026

నెలకు రూ.90వేల జీతం.. నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌లో 12 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech(కెమికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ /రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.90వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://portal2.nrl.co.in

News February 10, 2026

ఉపవాసం: ఏ ఆహారం తీసుకోవాలి?

image

కఠిన ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు, దుంపలు తీసుకోవచ్చు. ఉపవాస సమయంలో మినుములు, బూడిద గుమ్మడి పదార్థాలకు దూరంగా ఉండాలి. వంటల కార్యక్రమాలు చూడటం, ఆహారం గురించి చర్చించడం మనస్సును మళ్లిస్తుంది. అందుకే వాటిని నివారించాలి. బియ్యం లేదా బార్లీతో చేసిన ఆహారంతో ఉపవాసం విరమించడం శ్రేయస్కరం. విరమణ తర్వాత కూడా ఇడ్లీ, దోశ వంటి మినుములతో కూడిన పదార్థాలను తినకూడదని పండితులు సూచిస్తున్నారు.