News September 11, 2024

ఇప్పుడు ఎవరైనా కశ్మీర్‌కు స్వేచ్ఛగా వెళ్లొచ్చు: అజిత్ పవార్

image

దేశంలో ఎవరైనా నేడు స్వేచ్ఛగా కశ్మీర్ వెళ్లి రావొచ్చని ఎన్సీపీ నేత అజిత్ పవార్ గుర్తుచేశారు. తాను కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ వెళ్లేందుకు కూడా భయపడ్డానంటూ కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై పవార్ స్పందించారు. ‘బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదులను అణచివేసింది. లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకం ఎగరడం అనేది ఒకనాడు కల. నేడు అక్కడ జెండా రెపరెపలాడుతోంది’ అని పేర్కొన్నారు.

Similar News

News January 22, 2026

ఘోర ప్రమాదం.. బస్సు, లారీ దగ్ధం

image

AP: నంద్యాల(D) సిరివెల్లమెట్ట వద్ద ప్రైవేటు బస్సుకు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి HYD వెళ్తున్న ప్రైవేటు బస్సు టైర్ పేలడంతో డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ చనిపోయారు. వెంటనే మంటలు అంటుకోగా ఓ DCM డ్రైవర్ బస్సు అద్దాలు పగలగొట్టడంతో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు, లారీ పూర్తిగా కాలిపోయాయి. క్షతగాత్రులను నంద్యాల ఆస్పత్రికి తరలించారు.

News January 22, 2026

తెలుగు రాష్ట్రాల్లో సరస్వతీ దేవి ఆలయాలు

image

వసంత పంచమి నాడు తెలుగు రాష్ట్రాల్లోని సరస్వతీ క్షేత్రాలు భక్తజనంతో పోటెత్తుతాయి. TGలోని నిర్మల్ జిల్లాలో బాసర జ్ఞాన సరస్వతి ఆలయం అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి. సిద్దిపేట(D) వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రం కూడా ఎంతో విశిష్టమైనది. APలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు పండుగ రోజు సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తారు. మెదక్(D) ముక్తేశ్వర క్షేత్రం, అనంతపురం(D) హేమావతి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేస్తారు.

News January 22, 2026

చిరంజీవి మూవీ టికెట్ రేట్లు తగ్గింపు

image

AP: చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ టికెట్ రేట్స్ తగ్గాయి. ప్రభుత్వం తొలి 10రోజులు మల్టీప్లెక్సుల్లో రూ.120, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 పెంచుకునే అనుమతి ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో సాధారణ రేట్లకే టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. TGలోనూ టికెట్స్ నార్మల్ రేట్లకే అందుబాటులో ఉన్నాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.300+ కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.