News September 14, 2024

ఇక సెలవు.. కామ్రెడ్ ఏచూరి సీతారాం

image

CPM జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంతిమయాత్ర ముగిసింది. ఢిల్లీలోని CPM కేంద్ర కార్యాలయం ఏకే గోపాలన్ భవన్‌ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రి వరకు అంతిమయాత్ర సాగింది. అనంతరం ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రికి రీసెర్చ్ కోసం అప్పగించారు. ఇక సెలవంటూ దివికేగిన ఏచూరికి వివిధ దేశాల ప్రతినిధులు, అభిమానులు తుది వీడ్కోలు పలికారు. కడవరకు ప్రజాగొంతుకగా నిలిచిన కామ్రెడ్‌‌ను తలుచుకొని ‘లాల్ సలాం’ అంటూ నినదించారు.

Similar News

News January 17, 2026

బొజ్జన్న కొండ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన బౌద్ధ బిక్షువులు

image

అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో గల బొజ్జన్న కొండ వద్ద శుక్రవారం నిర్వహించిన బౌద్ద మేళాలో దేశ విదేశాలకు చెందిన బౌద్ధ బిక్షువులు పాల్గొన్నారు. బౌద్ధ స్తూపం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మేళాలో పాల్గొన్న వారికి బుద్ధుని పంచశీల సూక్తులను వివరించారు. ప్రపంచ శాంతికి బుద్ధుని శాంతి మార్గమే శరణ్యమని సూచించారు.

News January 17, 2026

బొజ్జన్న కొండ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన బౌద్ధ బిక్షువులు

image

అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో గల బొజ్జన్న కొండ వద్ద శుక్రవారం నిర్వహించిన బౌద్ద మేళాలో దేశ విదేశాలకు చెందిన బౌద్ధ బిక్షువులు పాల్గొన్నారు. బౌద్ధ స్తూపం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మేళాలో పాల్గొన్న వారికి బుద్ధుని పంచశీల సూక్తులను వివరించారు. ప్రపంచ శాంతికి బుద్ధుని శాంతి మార్గమే శరణ్యమని సూచించారు.

News January 17, 2026

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు సర్వం సిద్ధం

image

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఈనెల 18వ తేదీన ఆదివారం నిర్వహించేందుకు NTA అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. SGS స్కూల్, గీతం స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, శ్లోకా ఏ బిర్లా స్కూల్‌లో పరీక్షలు జరగనున్నాయి. 1569 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 6 తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు, 9 తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదు.