News June 25, 2024
NPDCL సీఎండీ అధికారులకు కీలక సూచన
NPDCL కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి నోడల్ ఆఫీసర్లు, సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. సోమవారం ఈ కాన్ఫరెన్స్లో సీఎండీ మాట్లాడుతూ.. బ్రేక్ డౌన్, ట్రిప్పింగ్లు జరిగినప్పుడు ప్రతి చోట ప్రత్యామ్నాయ సరఫరా ఉండేటట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 8, 2024
బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన మంత్రి సురేఖ
ఆలంపూర్లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని మంత్రి కొండా సురేఖ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి సురేఖకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రి చర్చించారు. స్థానిక నేతలు పాల్గొన్నారు.
News October 8, 2024
వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా..
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పలు రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ రూ.6100 ధర పలకగా, పచ్చి పల్లికాయ ధర రూ.4,000 పలికింది. మరోవైపు 5531 రకం మిర్చికి రూ. 14వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా ఫలితాలను గత వారంతో పోలిస్తే నేడు స్వల్పంగా పెరిగినట్లు రైతులు పేర్కొన్నారు.
News October 8, 2024
గౌరవ వందనం స్వీకరించిన మంత్రి కొండా సురేఖ
జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి కొండా సురేఖకు స్థానిక కలెక్టర్ సంతోశ్, ఎస్పీ శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొండా సురేఖ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కాసేపు ప్రజాప్రతినిధులతో మంత్రి కొండా సురేఖ చర్చించారు.