News September 18, 2024
నేడు NPS వాత్సల్య పథకం ప్రారంభం.. ప్రయోజనాలివే

బాల, బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించే NPS వాత్సల్య పథకం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. పిల్లల పేరుతో పేరెంట్స్/సంరక్షకులు ఈ ఖాతా తీసుకోవచ్చు. వారికి 18 ఏళ్లు నిండాక ఇది NPS అకౌంట్గా మారుతుంది. ఏడాదికి రూ.1,000 నుంచి ఎంతైనా జమ చేసుకోవచ్చు. ఏటా వడ్డీ జమవుతుంది. ఇందులో పెట్టుబడితో సెక్షన్ 8CCD(1B) కింద రూ.50వేల పన్ను మినహాయింపు ఉంటుంది. 60 ఏళ్లు వచ్చాక NPS నిధిలో 60% డబ్బులు ఒకేసారి తీసుకోవచ్చు.
Similar News
News November 2, 2025
తిరుమల: సర్వదర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 30 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శనివారం 72,860 మంది వేంకటేశ్వర స్వామిని దర్శించుకోగా.. 31,612 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.98 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.
News November 2, 2025
పోలీసుల అదుపులో జోగి రమేశ్ అనుచరుడు

AP: సిట్, ఎక్సైజ్ అధికారులు <<18174864>>జోగి రమేశ్<<>> ఇంటికి వచ్చారన్న సమాచారంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో అధికారులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు జోగి రమేశ్ అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అదుపులోకి తీసుకొని విజయవాడలోని సిట్ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
News November 2, 2025
ప్రెగ్నెన్సీ నిలవాలంటే..

కొంతమందికి పుట్టుకతోనే సెర్విక్స్ వీక్గా ఉంటుంది. దీనివల్ల గర్భస్థ శిశువు బరువు పెరిగే కొద్ది మోయలేక గర్భస్రావం అవుతుంది. దీన్ని సెర్వైకల్ ఇన్కంపిటెన్స్ అంటారు. అలా అయితే ట్రాన్స్వెజైనల్ సర్క్లేజ్ అంటే వెజైనాలోంచి సెర్విక్స్ దగ్గర టేప్తో కుట్లు వేస్తారు. కొన్నిసార్లు ట్రాన్స్అబ్డామినల్ అప్రోచ్ అంటే ప్రెగ్నెన్సీకి ముందు లేదా 3వ నెలలో పొట్టను ఓపెన్ చేసి సెర్విక్స్కి కుట్లు వేస్తారు.


