News March 13, 2025
NRML: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

డిగ్రీ పాసైన BC అభ్యర్థులకు బ్యాంకింగ్&ఫైనాన్స్లో ఫ్రీ ట్రైనింగ్,ఉద్యోగం కల్పించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రైనింగ్ పూర్తైన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్మెంట్ కల్పిస్తారన్నారు. అర్హులు ఈనెల 15 నుంచి www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏజ్ లిమిట్-26లోపు ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్-ఏప్రిల్ 8గా పేర్కొన్నారు. SHARE IT
Similar News
News December 11, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్

సీఎం చంద్రబాబు రేపు కపులుప్పాడలో కాగ్నిజెంట్ సహా ఐటీ పరిశ్రమల శంకుస్థాపనకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం భీమిలి–కపులుప్పాడ ప్రాంతాల్లో ఏర్పాట్లు పరిశీలించారు. రోడ్లు, భద్రత, పార్కింగ్ వంటి ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేశారు. సీఎం పర్యటనలో లోపాలేమీ లేకుండా పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
News December 11, 2025
రూ.100కే T20 వరల్డ్ కప్ టికెట్స్

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించిన టికెట్లను ఇవాళ సాయంత్రం 6.45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ICC ప్రకటించింది. ఇండియాలో ఫేజ్ వన్ టికెట్స్ రేట్స్ రూ.100 నుంచి, శ్రీలంకలో రూ.295 నుంచి ప్రారంభంకానున్నాయి. FEB 7నుంచి MAR 8 వరకు టోర్నీ కొనసాగనుంది. టికెట్స్ బుక్ చేసుకునేందుకు <
News December 11, 2025
ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ పుట్టా మహేష్ కుమార్

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) లో ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి 2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం లోక్ సభలో 377 నిబంధన కింద టీచర్ల సమస్యను ఏలూరు ఎంపీ లేవనెత్తారు. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పార్లమెంట్లో ప్రస్తావించారు.


