News March 13, 2025
NRML: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

డిగ్రీ పాసైన BC అభ్యర్థులకు బ్యాంకింగ్&ఫైనాన్స్లో ఫ్రీ ట్రైనింగ్,ఉద్యోగం కల్పించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రైనింగ్ పూర్తైన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్మెంట్ కల్పిస్తారన్నారు. అర్హులు ఈనెల 15 నుంచి www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏజ్ లిమిట్-26లోపు ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్-ఏప్రిల్ 8గా పేర్కొన్నారు. SHARE IT
Similar News
News December 18, 2025
రేషన్ కార్డుదారులు e-KYC తప్పనిసరి: DSO

రేషన్ కార్డుదారులందరికీ e-KYC తప్పనిసరి అని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ సూచించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హులైన లబ్ధిదారులందరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. రేషన్ డీలర్లు షాపులను తెరిచి ఉంచి, తమ పరిధిలోని కార్డుదారులందరితో 100 శాతం e-KYC చేయించాలని ఆదేశించారు. లబ్ధిదారులకు దీనిపై పూర్తి అవగాహన కల్పించి, గడువులోగా ప్రక్రియ ముగిసేలా చూడాలని స్పష్టం చేశారు.
News December 18, 2025
రేవంత్ రెడ్డి పతనానికి సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం: హరీష్రావు

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు 40 శాతం సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడం సీఎం రేవంత్ రెడ్డి పతనానికి నిదర్శనమని హరీష్ రావు విమర్శించారు. మెదక్లో గెలుపొందిన నూతన సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు బీఆర్ఎస్కే అండగా నిలిచారని, రాబోయే ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
News December 18, 2025
సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

సుక్మా జిల్లా పరిధిలోని గొండిగూడలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళ మావోయిస్టుతో సహా ముగ్గురు మృతి చెందారు. సుక్మా పోలీసుల వివరాలు.. గొండిగూడ అడవుల్లో మావోలు ఉన్నారన్న సమాచారం మేరకు కూంబింగ్ నిర్వహించామన్నారు. జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఏసీఎం ర్యాంకు, ఒక ఎల్ఓఎస్ సభ్యురాలు మృతి చెందారన్నారు. వారి వద్ద 9 ఎంఎం సర్వీస్ పిస్టల్, 12 బోర్, బార్మర్ గన్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.


