News April 14, 2025
NRML: ఒకే ప్రాంతం.. 4 యాక్సిడెంట్లు

నర్సాపూర్ మండలంలోని తురాటీ, చాక్పల్లి గ్రామాల వద్ద ఉన్న హైవే 61 రహదారిపై నిర్మించిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత 21 రోజుల్లో ఒకేచోట నాలుగు ప్రమాదాలు జరిగాయి. అందులో ఇద్దరు మరణించగా మిగతా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో హాస్పటల్ పాలయ్యారు. అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News November 22, 2025
గోదావరిఖని: రేపు డయల్ యువర్ సింగరేణి సిఅండ్ఎండీ

రేపు డయల్ యువర్ సింగరేణి సీఅండ్ఎండీ నిర్వహించనున్నారు. సింగరేణిలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలతోపాటు రక్షణ, వైద్య సేవల మెరుగుదలపై సూచనలు స్వీకరించేందుకు సీఅండ్ఎండీ ఎన్.బలరాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగునుంది. పాల్గొనదలచిన వారు 040-23311338 నంబర్కు ఫోన్ చేయవచ్చని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు.
News November 22, 2025
పెద్దపల్లి: అట్టర్ ఫ్లాప్ సీఎం రేవంత్ రెడ్డి: మాజీ ఎమ్మెల్యే

అట్టర్ ఫ్లాప్ సీఎం రేవంత్ రెడ్డి అని RMG Ex.MLA కోరుకంటి చందర్ ఘాటుగా విమర్శించారు. PDPLలోని BRS జిల్లా కార్యాలయంలో శుక్రవారం PDPL Ex.MLA మనోహర్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పాలన చేతగాక CM రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫార్మూలా ఈ కార్ రేసింగ్ కేసు తెరపైకి తెచ్చారని, ఇది కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న డ్రామా అన్నారు.
News November 22, 2025
PHOTO GALLERY: భారతీయ కళా మహోత్సవం

HYD బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’ సెకండ్ ఎడిషన్ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. నేటి ప్రదర్శనల ఫొటోలు పైన చూడవచ్చు.


