News February 28, 2025
NRML: జిల్లాలో గ్రాడ్యుయేట్ MLC పోలింగ్ వివరాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 11,497 పురుష, 5,644 స్త్రీ ఓటర్లను కలుపుకొని మొత్తం 17,141 పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. వీరిలో 8434 మంది పురుష, 4,008 మంది స్త్రీ ఓటర్లను కలుపుకొని మొత్తం 12,442 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి 72.59 శాతం ఓటింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 24, 2025
రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది. మార్కెట్లో రూ.40 నుంచి రూ.80 వరకు ఉన్న ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. తొలుత జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాలు, నగరాల్లో ఈ పథకం అమలుకానుంది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. డిమాండ్ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా సరఫరా చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
News December 24, 2025
పాడి పశువులను అలా కట్టేసే ఉంచుతున్నారా?

చాలా మంది పాడి రైతులు పశువులను రోజంతా అలా కట్టేసి ఉంచుతారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు వెటర్నరీ నిపుణులు. దీని వల్ల వాటికి గాయాలు కావడంతో పాటు మానసిక ఒత్తిడికి గురవడంతో పాటు క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుందని అంటున్నారు. వాటిని కచ్చితంగా ఉదయం, సాయంత్రం కాసేపు నడిపించాలని సలహా ఇస్తున్నారు. వాటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పశువులకు రోజూ స్నానం చేయించాలని సూచిస్తున్నారు.
News December 24, 2025
నారాయణపేట: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

నారాయణపేట జిల్లాలోని ధన్వాడ, కొత్తపల్లి, మాగనూర్, మక్తల్ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే <


