News February 28, 2025
NRML: జిల్లాలో గ్రాడ్యుయేట్ MLC పోలింగ్ వివరాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 11,497 పురుష, 5,644 స్త్రీ ఓటర్లను కలుపుకొని మొత్తం 17,141 పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. వీరిలో 8434 మంది పురుష, 4,008 మంది స్త్రీ ఓటర్లను కలుపుకొని మొత్తం 12,442 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి 72.59 శాతం ఓటింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 17, 2025
ఎల్లుండి గవర్నర్తో జగన్ భేటీ

AP: ఈ నెల 18న 4PMకు జగన్ గవర్నర్ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి <<18575709>>సంతకాల<<>> పత్రాలను అందజేస్తారని వైసీపీ తెలిపింది. అంతకుముందు 10AMకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సంతకాల పత్రాలు నిండిన వాహనాలను జగన్ జెండా ఊపి లోక్భవన్కు పంపిస్తారని వెల్లడించింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో సమావేశం అవుతారని వివరించింది.
News December 17, 2025
SRH మేనేజ్మెంట్పై ఫ్యాన్స్ ఫైర్

IPL-2026 సీజన్కు SRH టీమ్లో స్టార్ బౌలర్లు లేరని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. హర్షల్ పటేల్, పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్ ఉన్నా వాళ్లు భారీగా రన్స్ సమర్పించుకునే వారేనని గుర్తుచేస్తున్నారు. ఇషాన్ మలింగా, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలె, అమిత్ కుమార్, శివమ్ మావిలకు అనుభవం లేదని గుర్తుచేస్తున్నారు. స్టార్ బౌలర్లు లేకుండా టీమ్ను ఎలా బ్యాలెన్స్ చేస్తారని మండిపడుతున్నారు.
News December 17, 2025
KPHB సాయినగర్లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

KPHB PS పరిధిలోనీ సాయినగర్లోని ఇగ్నైట్ జూనియర్ కాలేజీలో 1st ఇయర్ MPC విద్యార్థి శ్రీకేతన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్లో జరిగిన ఈ దుర్ఘటనపై యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం దాచిపెట్టి మృతదేహాన్ని తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు చేరుకుని యాజమాన్యం వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


