News March 27, 2025
NRML: డీసీసీ అధ్యక్షురాలిగా మళ్లీ శ్రీహరిరావు..?

కాంగ్రెస్ TG ఇన్ఛార్జ్ మీనాక్షి పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టారు. నిన్న ఢిల్లీలో DCCలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా BRS అభ్యర్థులు పార్టీలో చేరినా.. సపరేట్ కేడర్ ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామని ఆరా తీశారు. జిల్లాల్లో పార్టీని అన్నిస్థాయుల్లో ప్రక్షాళనపై చర్చించినట్లు తెలిసింది. అయితే DCC పదవి మళ్లీ శ్రీహరిరావుకే కట్టబెడతారా.. లేక ఇతరులకు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.
Similar News
News December 13, 2025
MBNR: గెలుపు కోసం.. గౌను ధరించాడు..!

మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్ 1వ వార్డు అభ్యర్థి నారాయణగౌడ్ తన ఎన్నికల గుర్తు ‘గౌను’ను ప్రచారం కోసం వినూత్నంగా ఉపయోగించారు. గుర్తు అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో ఆయన గౌను ధరించి తమ వార్డులో ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ఈ ప్రచార పద్ధతి స్థానికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. నారాయణ గౌడ్ ప్రచారం చేస్తుంటే ప్రజలు ఆసక్తిగా చూశారు.
News December 13, 2025
IHFMS టెండర్లలో భారీగా అవకతవకలు!

రాష్ట్రంలోని ప్రభుత్వ టీచింగ్, మెడికల్ కాలేజీల్లో శానిటేషన్, పేషెంట్ కేర్ సేవలను మెరుగుపరిచేందుకు తెచ్చిన నూతన పాలసీకి కాంట్రాక్టర్లు అడ్డంకిగా మారారు. 2024లో కాంట్రాక్టు అసోసియేషన్ కోర్టుకు వెళ్లగా, ప్రభుత్వం నేటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ప్రతీ కాంట్రాక్టర్ నెలకు లక్షల ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
News December 13, 2025
నిర్మల్: మంత్రాల నేపంతో హత్య చేసి.. కాల్చేశారు..!

మంత్రాల నేపంతో వ్యక్తిని హత్య చేసి కాల్చి బూడిద చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖానాపూర్ CI అజయ్ ప్రకారం.. కడెం మం. గండిగోపాల్పూర్కు చెందిన దేశినేని భీమయ్య(55)ను అదే గ్రామానికి చెందిన నరేశ్, మల్లేశ్ ఈనెల 10న భీమయ్యాను కర్రలతో కొట్టి హత్య చేశారు. అనంతరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి బూడిద చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేశారు.


