News March 27, 2025
NRML: డీసీసీ అధ్యక్షురాలిగా మళ్లీ శ్రీహరిరావు..?

కాంగ్రెస్ TG ఇన్ఛార్జ్ మీనాక్షి పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టారు. నిన్న ఢిల్లీలో DCCలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా BRS అభ్యర్థులు పార్టీలో చేరినా.. సపరేట్ కేడర్ ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామని ఆరా తీశారు. జిల్లాల్లో పార్టీని అన్నిస్థాయుల్లో ప్రక్షాళనపై చర్చించినట్లు తెలిసింది. అయితే DCC పదవి మళ్లీ శ్రీహరిరావుకే కట్టబెడతారా.. లేక ఇతరులకు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.
Similar News
News October 16, 2025
కృష్ణా జిల్లాలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి

కృష్ణా జిల్లాలో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెనమలూరు మండలం పోరంకి వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి ప్రభుత్వం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బందరు కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి రూ. 49.6 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో రాకపోకలకు మార్గం సుగమం అయ్యేలా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం జరుగనుంది.
News October 16, 2025
గద్వాల: హాస్టల్ విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం భోజనం

2025-26 విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీ-మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. గురువారం ఐడీఓసీ మందిరంలో సంబంధిత అధికారులతో కొత్త మెనూ పోస్టర్ ఆవిష్కరించారు. ఇకపై జిల్లాలోని అన్ని హాస్టళ్లలో కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం ఇవ్వాలన్నారు. కిచెన్ షెడ్లు, వంట పాత్రలు శుభ్రంగా ఉంచుకుని, నాణ్యమైన ఆహారం ఇవ్వాలని సూచించారు.
News October 16, 2025
అనకాపల్లి: రేపు ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్

అనకాపల్లి కలెక్టరేట్లో శుక్రవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ జాహ్నవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే గ్రీవెన్స్లో వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. ఉద్యోగులు తమ సమస్యలపై అర్జీలు అందజేయవచ్చునని అన్నారు. గత నెలలో జరిగిన గ్రీవెన్స్లో అర్జీలు అందజేసిన ఉద్యోగులు వచ్చి వాటి స్థితిని తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు.