News March 6, 2025

NRML: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

image

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.

Similar News

News December 7, 2025

10వ తేదీ నుంచి జిల్లా టెట్ పరీక్షలు: డీఈవో

image

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లును చేసిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. ఈ నెల 10 తేదీ నుంచి 21 వరకు జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలులో 3, ఆదోని,ఎమ్మిగనూరులో 1 చొప్పున పరీక్షా ఏర్పాటు చేశారు. వీటితోపాటు హైదరాబాద్‌లో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 39,485 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు.

News December 7, 2025

నంద్యాలలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్

image

నంద్యాల జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రజల రక్షణ, భద్రతకు భరోసా కల్పించేందుకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ఉపయోగ పడుతుందన్నారు. నంద్యాల MS నగర్, VC కాలనీ, బ్రాహ్మణ కొట్కూరు పరిధిలోని కోళ్లబవాపురం గ్రామం, పాములపాడు పరిధిలోని మిట్టకందాల గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

News December 7, 2025

పొన్నూరులో ఇద్దరు పోలీసులు సస్పెండ్

image

పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న నాగార్జున, మహేష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం సస్పెండ్ చేశారు. అక్రమ రేషన్ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారికి సహకరిస్తూ, పోలీస్ నిఘా సమాచారాన్ని వారికి చేరవేశారని ఎస్పీ తెలిపారు. అక్రమ వ్యాపారస్తులకు సహకరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.