News February 16, 2025

 NRML: రాష్ట్రాలు దాటొచ్చిన ఎడారి ఓడ

image

రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఓ కుటుంబం తమ బతుకుదెరువు కోసం ఒంటెలను తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా నుంచి బాసరకు నాలుగు ఒంటెలను తీసుకొని వచ్చారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు కొంతమంది ఒంటెలను చూసి ఎంత బాగున్నాయంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కడ నుంచి వస్తున్నారని వారిని కొందరు పలకరించగా రాజస్థాన్ నుంచి పొట్టకూటి కోసం, ఒంటెల మేత కోసం ఇక్కడికి వచ్చినట్లు ఒంటెల కాపర్లు తెలిపారు.

Similar News

News April 17, 2026

VJA: డివిజన్ల పెంపు షురూ.. కార్పొరేషన్ కార్యాలయం చూస్తే బేజారు!

image

విజయవాడ నగరపాలక సంస్థలో వార్డుల సంఖ్య 64 నుంచి 86కు పెరగనుంది. మే నెలాఖరుకు కొత్త వార్డుల విభజన ప్రక్రియ పూర్తి కానుండగా, 6 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, పెరిగిన సభ్యుల సంఖ్యకు అనుగుణంగా కౌన్సిల్ హాలులో సరిపడా స్థలం లేదు. పాత భవనంలో సిబ్బందికే ఇరుకుగా ఉండగా, నిధుల లేమితో కొత్త భవన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఎన్నికల లోపు భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు.

News April 17, 2026

ఎంపీ వేం నరేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం!

image

1977 – జనతా పార్టీలో రాజకీయ ప్రవేశం
1983 – తెలుగుదేశం పార్టీలో చేరిక
1994 – మహబూబాబాద్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం
1999 – ఎమ్మెల్యే పోటీకి మరోసారి ప్రయత్నం
2004 – మహబూబాబాద్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం
తరువాత- ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర
2023 – కాంగ్రెస్ వ్యూహాల్లో కీలకంగా వ్యవహారం
2024 – సీఎం సలహాదారుగా నియామకం
2026 – రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం

News April 17, 2026

ASF: మట్టి కుండ నీరే ఆరోగ్య ప్రదాయిని

image

ఆసిఫాబాద్ జిల్లాలోని పల్లెల్లో మట్టి కుండల వినియోగం క్రమంగా తగ్గుతుండటంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రిజ్ నీటి కంటే కుండలో సహజంగా చల్లబడిన నీరే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వారు పేర్కొంటున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా వేసవిలో వడదెబ్బ నుంచి రక్షిస్తుందని వివరిస్తున్నారు. కృత్రిమ పద్ధతులకు దూరంగా ఉండి, సహజమైన చల్లదనాన్ని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.