News April 25, 2025
NRML: ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్జాపూర్ గ్రామానికి చెందిన కదం ప్రకాశ్(41) మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటి తట్టుకోలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 25, 2025
మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు

బానుడి భగభగలతో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. శుక్రవారం నుంచి రెండు రోజులపాటు వడగాల్పులు, రాత్రి వేళలో అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడి వాతావరణం నమోదవుతుందని జిల్లా వాతావరణం శాఖ తెలిపింది. కాగా గురువారం నారాయణపురంలో 43.1 అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గుండాల 42.8, రామన్నపేట 42.7, బీబీనగర్, చౌటుప్పల్ 42, మోత్కూర్ 41.7, వలిగొండ 41.5 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News April 25, 2025
మావోల వేట.. కర్రె గుట్టల్లో తూటాల మోతలు

ములుగు జిల్లాలోని కర్రె గుట్టల్లో మావోలు ఉన్నారనే సమాచారంతో మూడు రోజులుగా పోలీసులు గుట్టలను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దాదాపు 300 కి.మీ విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో 3వేలకు పైగా భద్రతా బలగాలు మోహరించినట్లు సమాచారం. కాల్పుల్లో ఇప్పటికే పలువురు మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. వెంకటాపురం, వాజేడు, అలుబాక టేకులగూడెం, తిప్పాపురానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ కర్రె గుట్టలు ఉన్నాయి.
News April 25, 2025
మావోల వేట.. కర్రె గుట్టల్లో తూటాల మోతలు

ములుగు జిల్లాలోని కర్రె గుట్టల్లో మావోలు ఉన్నారనే సమాచారంతో మూడు రోజులుగా పోలీసులు గుట్టలను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దాదాపు 300 కి.మీ విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో 3వేలకు పైగా భద్రతా బలగాలు మోహరించినట్లు సమాచారం. కాల్పుల్లో ఇప్పటికే పలువురు మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. వెంకటాపురం, వాజేడు, అలుబాక టేకులగూడెం, తిప్పాపురానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ కర్రె గుట్టలు ఉన్నాయి.