News February 23, 2025
NRML: నేడు ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష

ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-2026 విద్యాసంవత్సరానికి 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీకి ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో విద్యార్థుల కోసం అధికారులు పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
Similar News
News December 3, 2025
చిలుకూరులో ‘డబుల్’ ఓట్లు.. విచారణకు డిమాండ్

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకినగర్ గ్రామ పంచాయతీలో ఒక మహిళ పేరుపై రెండు ఓట్లు నమోదైన ఘటన కలకలం రేపింది. 6వ వార్డులోని 514, 518 సీరియల్ నంబర్లలో ఒకే పేరుతో ఉండగా, ఇంటి పేరు, భర్త పేరు మాత్రం వేరే విధంగా ఉన్నట్లు గుర్తించారు. మండలంలో ఇలా అనేక చోట్ల డబుల్ ఎంట్రీలు ఉన్నాయని ఆరోపిస్తూ, ఓటర్ల జాబితాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
News December 3, 2025
సూర్యాపేట: ‘పవన్ వ్యాఖ్యలపై పది రోజులకు స్పందించడం హాస్యాస్పదం’

పవన్ వ్యాఖ్యలపై పది రోజులకు మంత్రులు స్పందించడం హాస్యాస్పదమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పది రోజుల తర్వాత స్పందించిన తీరు ఇద్దరిలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు అనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ మంత్రులు స్పృహలో లేరనీ, కొందరు వాటర్లో నీళ్లు కలుపుకొని స్పృహ కోల్పోతున్నారని ఎద్దేవా చేశారు.
News December 3, 2025
GNT: మార్ఫింగ్ ఫొటోలు, ఫోన్ నంబర్లతో మహిళలపై దుష్ప్రచారం

మార్ఫింగ్ ఫొటోలు, ఫోన్ నంబర్లతో కాల్ గర్ల్స్ అంటూ సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని బాధిత మహిళలు పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ నంబర్ పెట్టడంతో ప్రతిరోజూ తమకు రకరకాల నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరువుకి భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఈ మేరకు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు.


