News April 12, 2025
NRML: మూడు రోజులే గడువు..APPLY NOW

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జడ్పీ సీఈఓ గోవింద్, మండల ఎంపీడీవో పుష్పలత సూచించారు. నర్సాపూర్(జి) మండలంలోని నందన్ గ్రామపంచాయతీలో పలువురు అధికారులు, గ్రామస్తులతో మాట్లాడారు. కులవృత్తులు చేసుకునే వారికి, నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఆసక్తి గలవారు ఏప్రిల్ 14 లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.
Similar News
News July 5, 2025
ఇవాళ టీమ్ ఇండియాకు కీలకం

ఇంగ్లండ్తో రెండో టెస్టులో పట్టు బిగించిన భారత్కు ఇవాళ(4వ రోజు) కీలకం కానుంది. తొలి టెస్టులో చేసిన తప్పులను రిపీట్ చేయకుండా ముఖ్యంగా నేటి మార్నింగ్ సెషన్లో వికెట్లు పడకుండా ఆడాలి. రెండో ఇన్నింగ్స్లో 64 పరుగులకు ఒక వికెట్ కోల్పోగా క్రీజులో రాహుల్, నాయర్ ఉన్నారు. వీరు నిలదొక్కుకొని వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలి. ప్రస్తుతం 244 రన్స్ లీడ్లో ఉండగా దాన్ని భారీ స్థాయికి తీసుకెళ్లాలి.
News July 5, 2025
ముమ్మిడివరం: బైపాస్ రోడ్డు వద్ద కాలువలో మృతదేహం

ముమ్మిడివరం కాశివాని తూము సమీపంలో బైపాస్ రోడ్డు వద్ద కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించారు. నిక్కరు షర్టు వేసుకుని సుమారు 50 సంవత్సరాలు పైబడిన పురుషుని మృతదేహంగా చెబుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.
News July 5, 2025
రాజేంద్రనగర్: 8 నుంచి డిప్లొమా కోర్సుల కౌన్సిలింగ్

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 8 నుంచి 11 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా.విద్యాసాగర్ తెలిపారు. కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థుల ర్యాంకుల వివరాలు, ఆయా తేదీలు కోసం వెబ్ సైట్ను చూడాలన్నారు. ఈ కౌన్సిలింగ్కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు కోర్సులకు సంబంధిత ఫీజును తీసుకురావాలని సూచించారు.