News April 18, 2025

NRML: రైల్వే స్టేషన్లో గొడవ.. బ్లేడ్‌తో మెడపై కోశాడు

image

నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన కుంచెపుబాబు నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో బుకింగ్ కౌంటర్ వద్ద పడుకొని ఉండగా ఓ వ్యక్తి బ్లేడుతో మెడపై కోశాడు. పై ఫోటోలో ఉన్న వ్యక్తి నిన్న బాధితుడి వద్దకు వచ్చి గొడవ పెట్టుకొని బ్లేడ్‌తో బాబు మెడపై కట్ చేశాడని రైల్వే SI సాయిరెడ్డి తెలిపారు. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆస్పత్రికి తరలించామన్నారు. ఫోటోలోని వ్యక్తి ఆచూకీ తెలిస్తే తమకు, పోలీసులకు సమాచారమివ్వాలన్నారు.

Similar News

News April 19, 2025

సౌదీలో పర్యటించనున్న మోదీ

image

ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ఏప్రిల్ 22, 23 తేదీల్లో సౌదీలో పర్యటిస్తారు. 2016, 2019 తర్వాత మూడోసారి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశంలో పర్యటించనున్నారు. 2023 సెప్టెంబర్‌లో G20 సమ్మిట్‌, సౌదీ-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య తొలి సమావేశంలో పాల్గొనేందుకు సౌదీ యువరాజు ఇండియా వచ్చిన విషయం తెలిసిందే.

News April 19, 2025

అక్టోబర్‌లో BRS అధ్యక్షుడి ఎన్నిక: KTR

image

TG: BRS పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అక్టోబర్‌లో ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వెల్లడించారు. HYD నేతలతో సమావేశమైన ఆయన పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు, ఈనెల 27న WGLలో జరిగే సభపై దిశానిర్దేశం చేశారు. ఆ సభ తర్వాత కొత్తగా పార్టీ సభ్యత్వాలు తీసుకుంటామని, ఇకపై డిజిటల్ సభ్యత్వాలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. అన్ని విషయాలపై అవగాహనతో మాట్లాడగలిగేలా కార్యకర్తలకు త్వరలో శిక్షణ ఇస్తామన్నారు.

News April 19, 2025

MPL: చిరుత మృతి.. వెలుగులోకి కొత్త విషయాలు?

image

మదనపల్లె పొన్నేటిపాళ్యం వద్ద చిరుత పులిని చంపిన కేసులో డొంక కదులుతోంది. ఈ కేసులో అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయగా, తప్పించుకు తిరుగుతున్న వారికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. తీగలాగితే డొంక కదిలినట్లు.. వన్యప్రాణులను వేటాడి బక్షించడమే కాకుండా నగదుకు విక్రయాలు చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలిందని సమాచారం. దీని వెనక ప్రొఫెషనల్స్ ముఠా ఉన్నట్లు తెలుస్తోది.

error: Content is protected !!