News March 16, 2025

NRML: LRS దరఖాస్తుదారులకు కలెక్టర్ సూచనలు

image

LRS దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. LRSకు దరఖాస్తు చేసుకున్న వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిల్లో 17,906, గ్రామీణ ప్రాంతాల్లో 6,680 దరఖాస్తులను రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేందుకు అర్హమైనవిగా గుర్తించినట్లు ఆమె వెల్లడించారు.

Similar News

News December 10, 2025

ADB: పల్లెల్లో ఎన్నికలు.. పట్టణాల్లో దావతులు

image

పంచాయతీ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. పట్టణాల్లో ఎన్నికల కోడ్ ఉండదని తెలిసి.. ఓటర్లను అక్కడికి తీసుకెళ్లి తమకే ఓటేయాలంటూ ఎర వేస్తున్నట్లు సమచారం. ఇప్పటికే ఎన్నికల నిబంధన కారణంగా వైన్స్ మూసివేయడంతో ఓటర్లను పట్టణాలకు తీసుకెళ్తున్నట్లు గ్రామాల్లో చర్చ నడుస్తోంది. అక్కడ వారికి దావత్‌లు ఇచ్చి రేపు ఉదయానికి గ్రామాలకు తీసుకెళ్లి ఓట్లు వేయించే పనిలో ఉన్నారు.

News December 10, 2025

ఉచిత ఇసుక పారదర్శకతకు కృషి: కలెక్టర్

image

ఉచిత ఇసుకను పారదర్శకంగా నిర్వహించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 4రీచ్‌లలో సెమీ మెకనైజ్డ్ పద్ధతి ద్వారా ఇసుక తీసేందుకు టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. ఈ రీచ్‌లలో మర్లపాలెం, కపిలేశ్వరం, జొన్నాడ, ఆలమూరు రీచ్‌లు ఉన్నాయని కలెక్టర్ వివరించారు.

News December 10, 2025

సూర్యాపేట: BRS కార్యకర్త హత్య.. హరీశ్‌రావు ఫైర్

image

పంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో BRS కార్యకర్త ఉప్పుల మల్లయ్య హత్య ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ అప్రజాస్వామిక, అరాచక పాలనకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య విలువలను కాలరాయడం బాధాకరమన్నారు.