News March 19, 2025
NRML: SC వర్గీకరణ, BC రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం: శ్రీహరిరావు

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు అన్నారు. బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
Similar News
News December 5, 2025
NRPT: ఎన్నికల సామగ్రి పంపిణీని పర్యవేక్షించిన కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన సామగ్రి పంపిణీని కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని శ్రీ దత్త బృందావన్ బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు కోస్గి, కొత్తపల్లి, మద్దూరు, గుండుమాల్ మండలాల్లో జరుగుతాయని చెప్పారు.
News December 5, 2025
వరంగల్: ఏకగ్రీవ పల్లెల్లో కాంగ్రెస్ దే హవా..!

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3 విడతల ఎన్నికల ప్రక్రియ చకచకా సాగిపోతోంది. పార్టీ గుర్తులు లేనప్పటికీ, పల్లెల ఓటర్లు అభ్యర్థుల పార్టీ మద్దతును తెలుసుకుని ఓటు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 555 పల్లెల్లో 1,802 మంది పోలింగ్కు వెళ్లగా, 53 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. అందులో కాంగ్రెస్ 44, BRS 5, BJP 1, ఇతరులు 3 సర్పంచ్గా గెలిచారు. 4952 వార్డులకు 981 ఏకగ్రీవం కాగా.. 8676 మంది పోలింగ్కు వెళ్తున్నారు.
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు.. తొలి విడతలో 395 స్థానాలు ఏకగ్రీవం

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలకు గాను 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 స్థానాలు ఉన్నాయి. అటు సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్లో 26 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఓవరాల్గా 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలవ్వలేదు. మిగిలిన 3,836 స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. కాగా మూడో విడత ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది.


