News December 10, 2025

NRPTలో రసవత్తర పోరు.!

image

నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన చెన్నమ్మ, సుజాతతో పాటు ఈసారి రాధిక, నాగరాణి కొత్తగా బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉండడంతో పోరు ఆసక్తిగా మారింది. 485 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో విజయం ఎవరిని వరిస్తుందో ఈ నెల 14న తేలనుంది. గత ఎన్నికల్లో సుజాత విజయం సాధించారు.

Similar News

News March 3, 2026

NLG: పర్యాటక సర్క్యూట్ @ బుద్ధవనం!

image

నాగార్జున సాగర్‌లోని బుద్ధవనం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఫణిగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట వంటి బౌద్ధ క్షేత్రాలను బుద్ధవనంతో అనుసంధానిస్తూ అంతర్జాతీయ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తాజాగా మంత్రి జూపల్లి వెల్లడించారు. PPP విధానంలో ఆరామాలు, ధ్యాన కేంద్రాలతో బుద్ధవనాన్ని ఒక విశ్వశాంతి కేంద్రంగా మార్చి, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చ

News March 3, 2026

టాటా మెమోరియల్ సెంటర్‌లో 40 పోస్టులు

image

<>ముంబైలోని <<>>టాటా మెమోరియల్ సెంటర్ 40 మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, BE/BTech, ME/MTech, MD/DNB/DM, BSc(MIT), MSc(AI, డేటా సైన్స్), డిప్లొమా, GNM అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/PET, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tmc.gov.in

News March 3, 2026

వలస పక్షుల విహారం.. చూపరులకు కనువిందు..!

image

ఓరుగల్లు అరణ్య ప్రాంతాలు, సరస్సు తీరాలు పక్షులకు నిలయాలుగా మారాయి. ఫిబ్రవరిలో విదేశాల నుంచి ఇక్కడకు వలస వచ్చి విహరిస్తుంటాయి. కొన్ని సంతాన ఉత్పత్తి చేసుకొని వేసవి ప్రారంభం కాగానే తిరిగి తమ దేశాలకు పయనిస్తుంటాయి. పలు జాతులు తమకు హాని లేదని గ్రహించి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 350 జాతుల పక్షులు ఉంటాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
#ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం.