News April 22, 2025

NRPT: అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్: BJP

image

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి అడుగడుగునా అవమానించిందని జిల్లా ఎస్సీమోర్చా ఇంఛార్జి, మాజీ ఎంపీ ముని స్వామి అన్నారు. అంబేడ్కర్ జయంతి వారోత్సవాల సందర్భంగా సోమవారం నారాయణపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యంగాన్ని అంబేడ్కర్ ఆశయాలను నెరవేస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

Similar News

News April 22, 2025

‘ఫసల్ భీమా’ యోజన అమలు చేయాలి: ఎమ్మెల్సీ

image

తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ‘ఫసల్ భీమా’ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా రైతు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం తక్షణమే తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన అమలు చేస్తే ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు మేలు జరుగుతుంది అంజిరెడ్డి అన్నారు.

News April 22, 2025

గిల్-సాయి జోడీ అదుర్స్

image

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ అదరగొడుతున్నారు. తొలి వికెట్‌కు మంచి భాగస్వామ్యం నమోదు చేస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు 8 ఇన్నింగ్సుల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో సహా మొత్తం 448 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ అందించారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇవే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో RCB నుంచి కోహ్లీ-సాల్ట్(315), SRH నుంచి హెడ్-అభిషేక్(314) ఉన్నారు.

News April 22, 2025

లక్షెట్టిపేట: యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మునుగంటి చంద్రశేఖర్(51) మృతి చెందాడని ఎస్సై సురేశ్ తెలిపారు. చంద్రశేఖర్ ఆదివారం మధ్యాహ్నం పౌరోహిత్యం ముగించుకొని వెంకట్రావుపేటకు వెళ్లే క్రమంలో ఎల్లారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్నారు. ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు.

error: Content is protected !!