News January 30, 2025
NRPT: ఆకతాయిలు వేధిస్తే చట్టపరమైన చర్యలు: పోలీసులు

మహిళలను ఆకతాయిలు వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షీ టీమ్ పోలీసులు బాలరాజు, చెన్నయ్య అన్నారు. బుధవారం నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు షీ టీమ్ పై అవగాహన కల్పించారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ చేయడం చట్టరీత్య నేరమని హెచ్చరించారు. ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తే షీ టీమ్ పోలీసులకు నేరుగా లేదా 8712670398 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 5, 2025
పర్వతగిరి: అభ్యర్థులంతా ఉద్యోగుల కుటుంబ సభ్యులే..!

పర్వతగిరి మండలంలోని బూర్గుమల్ల గ్రామంలో స్థానిక ఎన్నికల సందర్భంగా ఆసక్తికర ఘటన నెలకొంది. ఆ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సహా పలువురు వార్డు సభ్యుల అభ్యర్థులు ఉద్యోగుల కుటుంబ సభ్యులు కావడం గమనార్హం. ఒకరు ఎస్సై తల్లి అయితే మరొకరు కార్యదర్శి అమ్మ. ఒకరు జీపీవో, కార్యదర్శిల నాన్న. మరొకరు స్కూల్ అటెండర్ అత్త అయితే ఇంకొకరు అటెండర్ భర్త. మరొకరు అంగన్వాడీ టీచర్ కుమార్తె. దీంతో గ్రామంలో చర్చ నడుస్తోంది.
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
OU: ఈ నెల 22 నుంచి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET) పరీక్షలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ బి.శ్రీనివాస్ తెలిపారు. 3 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఈ విషయం గమనించాలని శ్రీనివాస్ కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు ఈ సెట్ నిర్వహిస్తారు.


