News February 16, 2025

NRPT: ఆర్డర్ కాపీలు అందుకున్న (2008) DSC అభ్యర్థులు

image

DSC 2008లో నష్టపోయిన అభ్యర్థులు ఎట్టకేలకు శనివారం రాత్రి అపాయింట్‌మెంట్ ఆర్డర్ కాపీలను అందుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ZPCEO సౌభాగ్య లక్ష్మి, DEO గోవిందరాజులు సమక్షంలో ముందుగా అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించారు. నారాయణపేట కలెక్టరేట్‌లో కలెక్టలో డీఈఓ గోవిందరాజు చేతుల మీదుగా ఉపాధ్యాయుల సంఘాలతో కలిసి 45 మంది 2008 DSC అభ్యర్థులు ఆర్డర్ కాపీలను అందుకున్నారు. 

Similar News

News December 5, 2025

కొనకనమిట్ల : ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి!

image

కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. ఇళ్లలోని వస్తువులు సైతం కదిలినట్లు చెప్తున్నారు. ఆ సమయంలో నిద్రలో నుంచి లేచి భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.

News December 5, 2025

మంచిర్యాల: సర్పంచ్ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్

image

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావుపల్లికి చెందిన ట్రాన్స్‌జెండర్ వైశాలి సర్పంచ్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీని జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో వైశాలి సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి దిగారు. సర్పంచ్‌గా తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని ఆమె గ్రామ ప్రజలను కోరారు. ఆమె నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

News December 5, 2025

తిరుమలలో ఇద్దరు అరెస్ట్

image

తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తామని భక్తులను మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సూళ్లూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, సునీల్ కుమార్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పేరిట ఫేక్ లెటర్లు సృష్టించారు. వీటి ద్వారా హైదరాబాద్ భక్తులను దర్శనానికి పంపారు. పోలీసులు నిఘా పెట్టి ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు నాయుడుపేటకు చెందిన ప్రవీణ్ కుమార్, చెంచు బాలాజీగా గుర్తించారు.